యూఏఈపై గ్యారీ కిర్స్టెన్ 188 నాటౌట్
అంతకుముందు 1996 వన్డే వరల్డ్ కప్లో యూఏఈపై గ్యారీ కిర్స్టెన్ 188 (నాటౌట్) పరుగులు చేశాడు. 20 ఏళ్లు ముగిసినా సఫారీ మాజీ ఆటగాడు కిర్స్టెన్ రికార్డు మాత్రం చెక్కుచెదరకపోవడం గమనార్హం. అయితే తనకు డబుల్ సెంచరీ ఆలోచన గానీ, అత్యధిక స్కోరు సాధించాలనే ఆలోచన రాలేదని అన్నాడు.
సంతోషంగా ఉందన్న డుప్లెసిస్
అయితే 180 పరుగులు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని డుప్లెసిస్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన డుప్లెసిస్ టెస్ట్ కెప్టెన్సీ తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని డుప్లెసిస్ అన్నాడు. వాస్తవానికి చివరి ఓవర్లో ఆడిన షాట్ ఫోర్ అయింటే కిర్స్టెన్ రికార్డును అధిగమించేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ ఔటయ్యానని చెప్పాడు.
రెండో స్థానం దక్కినందుకు సంతోషం
ఏది ఏమైతేనేం జట్టు విజయం సాధించిందని, కిర్స్టెన్ తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరులో రెండో స్థానం దక్కినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇదే మ్యాచ్లో కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ (64), క్వింటన్ డికాక్ (55) అర్ధ సెంచరీలతో రాణించారు. కాగా, శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార, సచిత పతిరణ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా డుప్లెసిస్
368 పరుగుల భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన శ్రీలంక పార్నెల్ (4/58), ప్రిటోరియస్ (2/55), రబాడ (2/50), ఇమ్రాన్ తాహిర్ (2/76) దెబ్బకు 48.1 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఉపుల్ తరంగ (119), నిరోషన్ డిక్వెల్లా (58), వీరక్కోడి (58) పోరాడినా ఓటమి తప్పలేదు. డుప్లెసిస్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య ఐదో వన్డే జరగనుంది.