గంగూలీ మట్లాడుతూ
శుక్రవారం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మట్లాడుతూ "‘రిషబ్ పంత్ భారత జట్టు భవిష్యత్ తార అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రపంచకప్ జట్టులో అతను ఇమడకపోవచ్చని అనుకుంటున్నా. ఇప్పుడున్న కూర్పులో మాత్రం ఇది సాధ్యంకాదు. అతనికి వన్డేల్లో ఆడిన అనుభవం కూడా తక్కువే" అని అన్నాడు.
దినేశ్ కార్తీక్ ప్రస్తుత భారత వన్డే జట్టులో లేడు
"దినేశ్ కార్తీక్ ప్రస్తుత భారత వన్డే జట్టులో లేడు. కాబట్టి అతన్ని ప్రత్యామ్నాయంగా పరిగణించరు. అంటే అతని గురించి సెలక్టర్లు ఆలోచించట్లేదు. దీంతో సెలెక్టర్లు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది" అని గంగూలీ అన్నాడు. మొత్తంగా వరల్డ్కప్ ముంగిట భారత జట్టు చాలా బలంగా ఉందని అతను అభిప్రాయపడ్డాడు.
కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం శుభ పరిణామం
"పేసర్లు బుమ్రా, భువీ, షమితో పాటు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్తో వైవిధ్యంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో రాహుల్ ఫామ్లోకి రావడం శుభ పరిణామం. భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్థాన్లు ఇంగ్లాండ్ గడ్డపై బాగా ఆడతాయి. దక్షిణాఫ్రికాపై మెరుగైన ప్రదర్శన చేసిన శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయకూడదు" అని గంగూలీ అన్నాడు.