భవిష్య ప్రణాళికపై సమీక్ష
బెంగళూరులో కొత్తగా నిర్మించాల్సిన ఎన్సీఏ, దాని అభివృద్ధి ప్రణాళికపై ద్రవిడ్, గంగూలీ దృష్టి సారించారు. ఇక జాతీయ క్రికెట్ అకాడమీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించిన భవిష్య ప్రణాళికను గంగూలీ, ద్రవిడ్ సమీక్షించారు. ప్రస్తుతం గాయపడిన ఆటగాళ్ల పునరావాస శిబిరంగానే ఎన్సీఏ ఉపయోగపడుతోంది. ఈ తరుణంలో యువ ఆటగాళ్లకు అత్యున్నత స్థాయిలో శిక్షణనిస్తూ రిజర్వ్ బెంచ్ను పటిష్ఠం చేయాలనుకుంటున్నారు.
ఎన్సీఏకు 40 ఎకరాలు
సమావేశం తర్వాత అందరూ కలిసి నగరంలో కొత్తగా ఎన్సీఏను నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు. అకాడమీ కోసం ఈ ఏడాది మేలో కర్ణాటక ప్రభుత్వం నుంచి 25 ఎకరాలకు ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ.. సెంటర్ ఫన్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం మరో 15 ఎకరాల స్థలాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఎన్సీఏకు 40 ఎకరాల స్థలం ఉంది.
అధునాతన సౌకర్యాలతో ఎన్సీఏ
ఈ 40 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో, అధునాతన సౌకర్యాలతో ఎన్సీఏను నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది. మూడు మైదానాలు, ఇండోర్ నెట్లు, పరిపాలన భవనాలు, హాస్టళ్లు నిర్మించాలని బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి అనుబంధంగా ఎన్సీఏ నడుస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ఎన్నో పనులు చేసారు.