పాక్ను నిషేధించాలనే కోరడం
"ఇక్కడ భారత ప్రభుత్వం కానీ బీసీసీఐ కానీ పాక్ను నిషేధించాలనే కోరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పాక్తో మనం మ్యాచ్లు ఆడకుండా ఉండటమే సరైన నిర్ణయం. ఇప్పటికే పాక్తో ద్వైపాక్షిక సిరీస్లను ఆపేశాం. ఐసీసీ నిర్వహించే ఈవెంట్లో ఒక జట్టును రద్దు చేయడమనేది కష్టం" అని గంగూలీ తెలిపాడు.
పాక్ ఆటగాళ్లకు వీసాలు నిరాకరించిన భారత ప్రభుత్వం
"భారత్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్కప్లో పాక్ ఆటగాళ్లకు మన ప్రభుత్వం వీసాలు నిరాకరించింది. ఇది ఒక వివాదంగా మారింది. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) తీవ్రంగా స్పందించడం మనం చూశాం. నా అభిప్రాయం ప్రకారం ఒక దేశాన్ని వరల్డ్కప్ నుంచి రద్దు చేయడం సాధ్యం కాదు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
ఐసీసీ సభ్య దేశాలను కోరిన బీసీసీఐ
పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్కప్లో పాక్తో భారత్ ఆడొద్దని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న దేశంతో సంబంధాలు తెంచుకోవాలని ఐసీసీ సభ్య దేశాలను బీసీసీఐ కోరింది.
ఐసీసీకి లేఖ రాసిన బీసీసీఐ
వరల్డ్ కప్లో ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల సంక్షేమం, పటిష్ట భద్రత కోసం లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. అందులో ఐసీసీ వరల్డ్కప్ను వీక్షించేందుకు వచ్చే భారత అభిమానుల భద్రత, క్షేమం గురించీ బీసీసీఐ భయపడుతోంది. మైదానాల్లో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, అభిమానులకు ఐసీసీ, ఈసీబీ పటిష్ట భద్రత కల్పించాలని కోరింది. నిజానికి... పాక్ను వరల్డ్కప్ నుంచి తప్పించాల్సిందిగా ఐసీసీని కోరే ప్రతిపాదనను కూడా వినోద్ రాయ్ ముందుకు తీసుకొచ్చినా.. తర్వాత విరమించుకున్నారు.