అంపైర్ తప్పుడు నిర్ణయం:
గత శుక్రవారం ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు సాన్విర్ సింగ్- శుభమాన్ గిల్లు ఇన్నింగ్స్ను ఆరంభించారు. సాన్విర్ సింగ్ డకౌట్గా పెవిలియన్ చేరడంతో.. గుర్క్రీత్ సింగ్ మన్తో కలిసి గిల్ ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నాడు. ఢిల్లీ బౌలర్ సిమర్ జీత్ సింగ్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని గిల్ ఎదుర్కొన్నాడు. అయితే, అది బ్యాట్కు తగలకుండానే వెళ్లి వికెట్ కీపర్ అనుజ్ రావత్ చేతిల్లో పడింది. ఢిల్లీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ పఠాక్ ఔట్గా ఇచ్చాడు.
భారీ జరిమానా:
తాను ఔట్ కాదనే విషయం శుభమాన్ గిల్కు స్పష్టంగా తెలియడంతో.. క్రీజ్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని పట్టుపట్టాడు. ఔట్ కాదని టీవీ రిప్లేలో తేలడంతో.. గిల్కు మరింత కోపం వచ్చింది. దీంతో అంఫైర్ను దుర్బాషలాడాడు. చివరకు మ్యాచ్ రిఫరీ కలగజేసుకుని గిల్కు సర్ధి చెప్పాడు. ఆన్ఫీల్డ్ అంపైర్ను దూషించడంతో గిల్పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది.
కెప్టెన్గా తొలగించాలి:
భారత-ఏ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ది రౌడీ ప్రవర్తన అని టీమిండియా మాజీ క్రికెటర్ బిషన్ బేడీ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్విటర్లో ఓ విలేకరి గిల్ విషయమై స్పందించాలని బేడీని కోరాడు. 'భారత-ఏ జట్టుకు కెప్టెన్గా ఉండి ఇలాంటి రౌడీ ప్రవర్తన కలిగిన ఏ క్రికెటర్ని క్షమించరాదు. ఎంత టాలెంట్ ఉన్న ఆటగాడైనా.. ఆట కంటే ఎక్కువ కాదు. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు చేయకముందే గిల్ను కెప్టెన్గా తొలగించాలి. అతని స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసి హెచ్చరిక చేయాలి' అని బేడీ అన్నారు.