సోదరితో కలిసి కార్డ్ ట్రిక్:
తాజాగా శ్రేయస్ అయ్యర్ హౌస్ మాజీషియన్గా మారిపోయి తన సోదరితో కలిసి కార్డ్ ట్రిక్ షోను ప్రదర్శించాడు. కార్డ్ ట్రిక్ షో భాగంగా.. తొలుత అయ్యర్ కొన్ని పేకముక్కల్ని తీసుకొని అందులో ఒకటి ఎంపిక చేసుకోమని తన సోదరికి చెప్తాడు. ఆమె ఒక కార్డు (8)ను తీసుకొని మనకు చూపిస్తుంది. దాన్ని మళ్లీ ఆ పేక ముక్కల్లో కలిపాక.. శ్రేయస్ మరో కార్డుని ఎంపిక చేసుకోమని ఆమెకు చెబుతాడు. నటాషా రెండో ముక్క (2)ను తీసి మనకు చూపించాక..దాన్ని మళ్లీ పేక ముక్కల్లో కలిపేస్తాడు శ్రేయస్.
శ్రేయస్ మ్యాజిక్ ట్రిక్:
రెండో ముక్క తర్వాత శ్రేయస్ అయ్యర్ తన మ్యాజిక్ ట్రిక్ను ప్రదర్శిస్తాడు. నటాషా తొలిసారి ఎంపిక చేసుకున్న పేక ముక్కను బయటకు విసురుతాడు. దీంతో నటాషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ ట్రిక్ను బీసీసీఐ తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. 'మీ ముందుకు వస్తున్నాడు.. మన జట్టులోని మెజీషియన్ శ్రేయస్ అయ్యర్. మేమంతా ఇళ్లల్లో ఉంటుండగా, మా అందరికీ సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు శ్రేయస్ అయ్యర్' అని పోస్టులో పేర్కొంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రేయస్ అయ్యర్కు మ్యాజిక్ ట్రిక్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదివరకే పలుమార్లు తన మాయాజాలం ప్రదర్శించి ఆకట్టుకున్నాడు.
ద్రవిడ్ కూడా:
మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అయితే కరోనాతో వచ్చిన ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న రాహుల్.. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్యాట్తో బంతిని కొడుతూ, పుస్తకాలు చదువుతూ, ఐపాడ్లో పనిచేస్తూ రకరకాలుగా గడుపుతూ కాలక్షేపం చేశాడు. పలు విధాలుగా చేసిన దానిని ఒక వీడియోగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్గా మారింది.
|
స్వీయ నిర్భందంలోనే ఉంటూనే ఎంజాయ్:
కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్-13ను వచ్చే నెల 15 వరకు బీసీసీఐ వాయిదా వేసింది. కానీ అప్పుడైనా జరుగుతుందనే నమ్మకం లేదు. జులై-సెప్టెంబర్ మధ్యలో ఐపీఎల్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తుంటే.. క్రికెటర్లు మాత్రం హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వీయ నిర్భందంలోనే ఉంటూనే ఎంజాయ్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు.