|
పంజాబీ స్టైల్లో క్రిస్ గేల్ తలపాగా
మైదానం బయట లోపల క్రిస్ గేల్ తన సహచర ఆటగాళ్లతో ఎంతో సరదాగా ఉండే సంగతి తెలిసిందే. ఈ సెల్ఫీలో క్రిస్ గేల్ పంజాబీ స్టైల్లో తలపాగా ధరించాడు. 'నేనెవరిని కలిశానో చూడండి. జమైకన్ దలేర్ మెహందీని.. బోలో తారా రా రా' అంటూ యూనివర్స్ బాస్తో కలిసి ఉన్న ఫోటోని ధావన్ ట్విట్టర్లో పోస్టు చేశాడు.
అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 11వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన క్రిస్ గేల్ ఆ జట్టు తరుపున ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డుు సాధించాడు. మొత్తం 11 మ్యాచ్లు ఆడిన గేల్ 368 పరుగులు చేశాడు.
16 మ్యాచ్లాడిన ధావన్ 497 పరుగులు
ఇందులో ఓ సెంచరీ (104 నాటౌట్) కూడా ఉంది. కాగా, ఈ సీజన్లో పంజాబ్ తరుపున కేఎల్ రాహుల్ 659 పరుగులు నమోదు చేశాడు. ఇక, శిఖర్ ధావన్ విషయానికి వస్తే ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పదో స్ధానంలో నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లాడిన ధావన్ 497 పరుగులు చేశాడు.
ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 నాటౌట్
ఈ సీజన్లో ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 నాటౌట్. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైనల్కు చేరిన సన్రైజర్స్ హైదరాబాద్ ముంబైలోని వాంఖడె స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ధావన్ 25 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 26 పరుగులు చేశాడు.