విరాట్కు భయపడుతున్నారు..
'విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్మన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెప్టెన్గా ఉన్నందున టీమిండియా సభ్యులకు అతనంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. అయితే అదే సమయంలో అతనికి వారు భయపడినట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కోహ్లీ ప్రొఫెషనలిజంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. కచ్చితమైన ఫలితాలు కావాలంటాడు. రహానే ఈ అంశాలకు విలువనిస్తూనే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడేలా స్వేచ్ఛనిస్తాడు.
కాలమే నిర్ణయిస్తుంది..
నేను గనుక టీమిండియా సెలక్టర్ అయితే రహానేను సారథిని చేసి, కోహ్లీని కేవలం బ్యాటింగ్పై ఫోకస్ చేయమని చెప్పేవాడిని. కోహ్లీ జోష్లో ఉంటే జట్టు కూడా అదే స్థాయిలో మెరుగ్గా రాణిస్తుంది. అయితే ఇలాంటి ఒక పరిణామం జరుగుతుందా? లేదా అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది.'అని షేన్ లీ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ తరఫున షేన్ లీ 45 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇక టీమిండియా ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్కు సన్నద్ధమవుతోంది.
ఒక్క సెంచరీ లేదు..
గతేడాది విరాట్ కోహ్లీకి కలిసి రాలేదు. మూడు ఫార్మాట్లలో కనీసం ఒక్క సెంచరీ కూడా అతను చేయలేకపోయాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో ఓడిపోవడం, ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఓటమి, అనంతరం పింక్ టెస్టు ఓటమితో కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దానికి తోడు అతని గైర్హాజరీలో జట్టును నడిపించిన రహానే చారిత్రాత్మక విజయాన్నందించడంతో కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు మరీ ఎక్కువయ్యాయి.
దీనికి తోడు ఐపీఎల్ టైటిల్ కొరత కూడా కోహ్లీ సారథ్యానికి మయాని మచ్చగా నిలుస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై రహానే సారథ్యంలో చారిత్రక టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా ఇంగ్లండ్తో సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ నెల 5న చెన్నై వేదికగా ఇరుజట్లు తొలి టెస్టులో తలపడనున్నాయి.