పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు
ఈ ఓటమితో పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై పాక్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నెటిజన్లు అయితే, పాక్ జట్టులోని ఆటగాళ్లను అసభ్య పదాలతో దూషించారు కూడా. టోర్నీలో భాగంగా పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్ని జూన్ 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
23న దక్షిణాఫ్రికాతో మ్యాచ్
ఈ మ్యాచ్కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్కి ముందు పాక్ ఆటగాళ్లకు కాస్త సమయం లభించడంతో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్కు వెళ్లారు. ఈ సమయంలో సర్ఫరాజ్ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్ సైతం అంగీకరించాడు. అదే సమయంలో సర్ఫరాజ్ కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు.
|
ఎందుకిలా పందిలా బలిసావు
దీంతో ఆ అభిమాని "సర్ఫరాజ్ బాయ్.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా" అంటూ ఘోరంగా అవమానపరిచాడు. సర్ఫరాజ్ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సర్ఫరాజ్ పట్ల ఆ అభిమాని చర్యను నెటిజన్లు తప్పుబట్టారు.
|
నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా
"నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్కు నేర్పించింది" అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... "నీవు చేసే 9-5 ఉద్యోగంలో ఏదో తప్పిదం చేస్తే.. అప్పుడు జనాలంతా రోడ్లపై నిన్ను ఇలానే అవమానపరిస్తే తట్టుకుంటావా?" అని మరొక నెటిజన్ ప్రశ్నించాడు.