పాక్ కెప్టెన్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మాద్ మాట్లాడుతూ "శుక్రవారం చరిత్ర సృష్టించబడుతుంది. ద్వైపాక్షిక సిరిస్లో భాగంగా జనవరి 2009 తర్వాత కరాచీలో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ చరిత్రలో క్రికెట్ అభిమానులు భాగస్వామ్యం కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఫలితంగా నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ సిరీస్ జరిగిందని ఆ తర్వాతి తరానికి తెలియజేయవచ్చు" అని ఐసీసీతో అన్నాడు.
శుక్రవారం వరకు ఆగలేకపోతున్నా
"శుక్రవారం వరకు ఆగలేకపోతున్నాను. ఇది చిరస్మరణీయ సందర్భం గుర్తు చేస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు, నా వెనుక అభిమానులు మొత్తం ఉన్నారని... నన్ను ఉత్సాహపర్చడమే కాదు... ఇరు జట్లను" అని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. ఇటీవలే పాక్ వైస్ కెప్టెన్గా ఎంపికైన బాబర్ అజామ్ శుక్రవారాన్ని తన జీవితంలో మరిచిపోలేని రోజుగా అభివర్ణించాడు.
బాబర్ అజామ్ మాట్లాడుతూ
బాబర్ అజామ్ మాట్లాడుతూ "నా కెరీర్ ప్రారంభ రోజుల్లో నా అభిమానులందరి నుండి నాకు లభించిన ప్రేమ, గౌరవానికి నేను తగినంత కృతజ్ఞతలు చెప్పలేను. పాకిస్థాన్ వైస్ కెప్టెన్గా నేను మైదానంలో బరిలోకి దిగే శుక్రవారం నా అతిపెద్ద రోజులలో ఒకటి. దేశం మొత్తం, అలాగే నేషనల్ స్టేడియంలోని ప్రేక్షకులు గుర్తుంచుకునే రోజుగా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నా" అని అన్నాడు.
|
3 వన్డేలు, 3 టీ20ల కోసం
పాకిస్థాన్తో మూడు వన్డేలు, మూడు టీ20 ఆడేందుకు శ్రీలంక జట్టు మంగళవారం ఉదయం కొలంబో నుంచి పాకిస్థాన్కు బయలుదేరింది. అయితే వెళ్లే ముందు లంక ఆటగాళ్లు పూర్తి జాగ్రత్తలు తీసుకుని మరీ బయల్దేరిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన అనుమానాలతో కెప్టెన్లు లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు దూరంగా ఉన్నారు.
|
సీనియర్ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో
సీనియర్ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో.. శ్రీలంక బోర్డు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని అక్కడికి పంపించింది. పాక్ పర్యటనకు బయల్దేరడానికి ముందు శ్రీలంక జట్టులోని ఆటగాళ్లు అందరూ బౌద్ధ గురువుతో తాయెత్తులు కట్టించుకున్నారు. తాయెత్తులకు సంబందించిన పోటోలను లంక బోర్డు ట్విటర్లో పోస్టు చేసింది.
లంక పెద్ద సాహసమే
2009లో పాక్ పర్యటన సందర్భంగా.. శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఆరుగురు లంక ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. ఎట్టకేకలకు లంక సాహసం చేస్తోంది.