|
ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు
తాజాగా భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, మొహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించారు. 'సొంతగడ్డపై 11 వరుస టెస్ట్ సిరీస్లు సాధించిన టీమిండియాకు అభినందనలు. ఈ రికార్డును సాధించడానికి ఆటగాళ్లు చాలా స్థిరత్వం ప్రదర్శించారు. అందరూ అద్భుతంగా రాణించారు' అని సచిన్ ట్వీట్ చేశారు.
|
ఆటను ఇలాగే కొనసాగించండి
'స్వదేశంలో 11 వరుస టెస్ట్ సిరీస్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియాకు శుభాకాంక్షలు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా గొప్ప రౌండ్ ప్రదర్శన చేస్తోంది. 200 పాయింట్లు సాధించడం గొప్ప ప్రారంభం' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు. 'మరో మంచి విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం మొత్తం జట్టు సమిష్టి కృషి. మ్యాచ్ ఆసాంతం బౌలర్లు అద్భుతంగా రాణించారు. సాహా క్యాచ్ సూపర్. ఈ ఆటను ఇలాగే కొనసాగించండి' అని లక్ష్మణ్ పేర్కొన్నారు. ..
|
వెల్ డన్ టీమిండియా
'దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. మ్యాచ్తో పాటు టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు. 'వెల్ డన్' టీమిండియా' అని హర్భజన్ ట్వీట్ చేశారు. 'చాలా సులభంగా స్వదేశంలో వరుసగా 11వ టెస్ట్ సిరీస్ విజయం సాధించారు. బౌలర్ల నుండి అద్భుతమైన ప్రదర్శనను చూసాను. విరాట్ కోహ్లీ క్లాస్ ఆటను మరోసారి ఆడాడు. టీమిండియాకు అభినందనలు' అని కైఫ్ రాసుకొచ్చారు.
సొంతగడ్డపై 11వ టెస్ట్ సిరీస్ విజయం
పుణె టెస్టులో కెప్టెన్ కోహ్లీ (254) డబుల్ సెంచరీ చేయడంతో టీమిండియా 601/5తో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 275 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఫాల్ఆన్ ఆడిన ప్రొటీస్.. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 189 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ ఈ మ్యాచ్తో పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. 2015లో జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ స్వదేశంలో జరిగిన ప్రతి టెస్టు సిరీస్ను గెలిపించాడు.