అప్పీల్ చేయగా
ఈ మ్యాచ్లో టామ్ కరన్ ఔట్ విషయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా.. పేసర్ దీపక్ చాహర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో బౌలింగ్ దిగాడు. ఆ ఓవర్ ఐదో బంతిని టామ్ కరన్ ఫుల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్కి తగలకుండా థై ఫ్యాడ్స్ని తాకింది. కీపర్ ఎంఎస్ ధోనీ ఆ బంతిని క్యాచ్గా అందుకుని అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ సి షంషుద్దీన్ ఔట్ ఇచ్చాడు.
అంపైర్ల చర్చలు
బంతి తన బ్యాట్కి తాకలేదని టామ్ కరన్ డీఆర్ఎస్ కోరే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే రాహుల్ తెవాటియా రాజస్థాన్ రాయల్స్కి ఉన్న ఏకైక డీఆర్ఎస్ని వాడుకున్నాడు. దాంతో కరన్ నిరాశగా పెవిలియన్కి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. కొంత దూరం వెళ్లాక అంపైర్లు చర్చలు చేస్తుండంతో కరన్ మైదానాన్ని వీడలేదు. కరన్ ఔట్ విషయాన్ని లెగ్ అంపైర్ వినీత్ కులకర్ణితో చర్చించిన షంషుద్దీన్.. థర్డ్ అంపైర్ను సంప్రదించారు. సరైన నిర్ణయం చెప్పాల్సిందిగా వారు కోరారు.
ఎల్బీడబ్ల్యూ అవకాశాన్ని చెక్ చేయలేదు
రిప్లేలో ఎంఎస్ ధోనీ క్యాచ్ అందుకోవడానికి ముందే బంతి నేలకు తాకించినట్లు తేలింది. అలాగే బంతి కరన్ బ్యాట్ను హిట్ చేయలేదని థర్డ్ అంపైర్ పరిశీలనలో స్పష్టమైంది. దీంతో అంపైర్ షంషుద్దీన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే థర్డ్ అంపైర్ ఇక్కడో విషయాన్ని గమనించలేదు. ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాన్ని మాత్రం చెక్ చేయలేదు. రిప్లేలో బంతి వికెట్లను తాకేలా కనిపించింది. థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ అయ్యే ఛాన్స్ పరిశీలిస్తే.. కరన్ పెవిలియన్కు చేరేవాడు.
టెక్నాలజీని సరైన విధంగా వాడాలి
ఈ విషయంపై చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ స్పందించారు. 'థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడో, లేదో అని పరిశీలిస్తే..టామ్ కరన్ పెవిలియన్కు చేరేవాడు' అంటూ ట్విట్ చేశారు. 'టెక్నాలజీని సరైన విధంగా వాడాలి. క్యాచ్, ఎల్బీడబ్ల్యూ రెండు ఔటే' అంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత సాక్షి తన పోస్టును డిలీట్ చేయడం విశేషం.