
గతేడాది వేలం తర్వాత మిగిలిన సొమ్ముని
కానీ.. ఆ వేలం సమయానికి టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీల వద్ద గతేడాది వేలం తర్వాత మిగిలిన సొమ్ముని మినహాయించి అదనంగా రూ.3 కోట్లు డబ్బు ఉండాలనేది నిబంధన. దీంతో.. అన్ని ఫ్రాంఛైజీలు తాము వద్దనుకున్న ఆటగాళ్లను విడిచిపెట్టడంతో పాటు.. తమకి కావాల్సిన క్రికెటర్లని కొనుగోలు చేయడం మొదలెట్టాయి.

2018 సీజన్ వేలంలో డికాక్ని రూ. 2.8 కోట్లకే
ఈ సర్దుబాట్లలో భాగంగా తొలి కొనుగోలుని ముంబై ఫ్రాంఛైజీ డికాక్ రూపంలో చేపట్టింది. ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో డికాక్ని రూ. 2.8 కోట్లకే బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా డికాక్ని కొనుగోలు చేసిన ముంబై ఫ్రాంఛైజీ.. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ. 2.2 కోట్లు), శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయ (రూ.50 లక్షలు)లను విడిచిపెట్టింది.

34 మ్యాచ్ల్లో 927 పరుగులు
ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకి ఆడిన డికాక్.. ఇప్పటి వరకు 34 మ్యాచ్ల్లో 927 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే.. ముంబై జట్టులో ఇప్పటికే ఇషాన్ కిషన్, ఆదిత్య తారె రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు.

ముంబై.. వికెట్ కీపర్ అయిన డికాక్ని
కానీ.. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)కి తోడుగా ప్రొఫెషనల్ ఓపెనర్ కోసం ఎదురుచూస్తున్న ముంబై.. తాజాగా ఓపెనర్/ వికెట్ కీపర్ అయిన డికాక్ని ఒడిసిపట్టేసింది. ఐపీఎల్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్లో ఆడుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications













