— Anna 24GhanteChaukanna (Anna24GhanteCh2) January 25, 2023 |
అసలేం జరిగిందంటే..?
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 26వ ఓవర్లో క్రీజులో సెట్ అయిన డారిల్ మిచెల్ను షార్ట్ పిచ్ బాల్తో పెవిలియన్ చేర్చిన శార్దూల్ ఠాకూర్.. ఆ మరుసటి బంతికే కెప్టెన్ టామ్ లాథమ్ను నకుల్ బాల్తో బోల్తా కొట్టించాడు. రెండు వికెట్లు కోల్పోయినా.. సెంచరీతో సెట్ అయిన డెవాన్ కాన్వే వరుసగా రెండు బౌండరీలు బాదాడు. శార్దూల్ వేసిన షాట్ పిచ్ బాల్స్ను ముందే పసిగట్టి కాన్వే.. రెండు బౌండరీలు బాదాడు. దాంతో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. అలా రెండు షాట్ పిచ్ బాల్స్ ఎందుకు వేసావని మండిపడ్డాడు. ఫీల్డింగ్ తగ్గట్లు బౌలింగ్ చేయాల్సింది కదా? అని మందలించాడు.
మెజిషియన్ అంటూ..
మ్యాచ్ అనంతరం శార్దూల్పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'శార్దూల్ ప్రత్యేకంగా నిలిచాడు. కీలక సమయంలో వికెట్లు తీశాడు. అందుకే జట్టు సహచరులంతా అతడిని మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. సరైన సమయంలో బౌలింగ్తో అదరగొట్టాడు. ఇలాంటి అద్భుతమైన మరిన్ని మ్యాచ్లను ఇంకా ఆడాలి. అతడు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే నేర్పు అలవర్చుకొన్నాడు. కేవలం వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లో కూడా వికెట్లు సాధిస్తున్నాడు. అతడు మాకు చాలా కీలకం. భవిష్యత్తులో కూడా అతడు ఇలానే రాణిస్తాడని ఆశిస్తున్నాను. ఇది జట్టుకు మంచి చేయడంతోపాటు.. వికెట్లు తీసుకోగలను అనే ఆత్మవిశ్వాసం అతడిలో పెరుగుతుంది. శార్దూల్ చాలా తెలివైనవాడు. దేశీయంగా చాలా క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఏం చేయాలనేదానిపై అవగాహన ఉంది'' అని పేర్కొన్నాడు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్దూల్..
ఈ మ్యాచ్లో 6 ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్.. 45 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసాడు. అంతకుముందు బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యాతో కలిసి 17 బంతుల్లో 25 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోర్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.