|
గుడ్ మార్నింగ్ అంటూ పంత్ ట్వీట్
ఈ విషయాన్ని బొనీ పైన్ తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొనడంతో పాటు రిషబ్ పంత్ బెస్ట్ బేబీసిట్టర్ అని ప్రశంసలు కూడా కురిపించింది. అయితే, ఇటీవలే ఓ తండ్రి అయిన రోహిత్ శర్మ కూడా తన కుమార్తెని ఆడించాలని రిషబ్ పంత్ను కోరడం విశేషం. బుధవారం పంత్ గుడ్ మార్నింగ్ అంటూ ట్వీట్ చేశాడు.
|
రోహిత్ శర్మ రీట్వీట్ చేస్తూ
పంత్ ట్వీట్కు రోహిత్ శర్మ రీట్వీట్ చేస్తూ "శుభోధయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్ కావాలి" అంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఇక్కడ రోహిత్ శర్మ ఒక్కడే పంత్ సాయం కోరడం లేదు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ భార్య బోనీ పైన్ సైతం మరోసారి పంత్ సాయం కోరింది.
మరోసారి నాపిల్లలను ఆడించవా
"పంత్ నీవు ఫ్రీగా ఉంటే మరోసారి నాపిల్లలను ఆడించవా" అని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పంత్ను బెస్ట్ బేబిసిస్టర్ను చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఆసీస్తో ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ సిరీస్లో 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్ 20 క్యాచ్లు, 350 పరుగులతో అద్భుతంగా రాణించాడు.
జనవరి 12 నుంచి వన్డే సిరిస్
జనవరి 12 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరిస్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోకి రావడంతో పంత్ భారత్కు పయనం కానున్నాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ వరకు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. జనవరి 23 నుంచి భారత్-ఏ జట్టు తరపున పంత్ బరిలోకి దిగనున్నాడు.