పుజారాపై ఆగ్రహం:
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో పరుగు తీయడానికి చతేశ్వర పుజారా వెనకడుగేయడంతో సహనాన్ని కోల్పోయి తన నోటికి పని చెప్పిన రోహిత్.. రెండో టీ20లో మరోసారి అదే ఘటనను పునరావృతం చేసాడు. అయితే ఈసారి ఏకంగా థర్డ్ అంపైర్పై తన కోపాన్ని ప్రదర్శించాడు. థర్డ్ అంపైర్ ఔట్ విషయంలో తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో రోహిత్ అతనిపై అసభ్య పదజాలం వాడాడు. పుజారాపై ఆగ్రహం:
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో పరుగు తీయడానికి చతేశ్వర పుజారా వెనకడుగేయడంతో సహనాన్ని కోల్పోయి తన నోటికి పని చెప్పిన రోహిత్.. రెండో టీ20లో మరోసారి అదే ఘటనను పునరావృతం చేసాడు. అయితే ఈసారి ఏకంగా థర్డ్ అంపైర్పై తన కోపాన్ని ప్రదర్శించాడు. థర్డ్ అంపైర్ ఔట్ విషయంలో తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో రోహిత్ అతనిపై అసభ్య పదజాలం వాడాడు.
ఔట్ అయినా.. నాటౌట్:
ఇంతకు ఏం జరిగిందంటే... బంగ్లా ఇన్నింగ్స్ 13 ఓవర్ను స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వేస్తున్నాడు. చహల్ వేసిన ఓ బంతికి సౌమ్య సర్కార్ (30; 2 ఫోర్లు, 1 సిక్స్)ను రిషభ్ పంత్ స్టంపౌట్ చేశాడు. ఫీల్డ్ అంపైర్కు అనుమానం ఉండడంతో థర్డ్ అంపైర్ను ఆశ్రయించాడు. అంపైర్ నిర్ణయం కోసం సౌమ్య సర్కార్ బౌండరీ లైన్ వద్ద నిరీక్షిస్తున్నాడు. సౌమ్య క్లియర్గా ఔట్ అని రిప్లైలో తేలినా.. స్క్రీన్ మీద నాటౌట్ అని డిస్ప్లే అయ్యింది.
అంపైర్పై అసభ్య పదజాలం:
స్క్రీన్ చూసిన రోహిత్ తన సహనాన్ని కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్ పక్కన ఉండగానే థర్డ్ అంపైర్ను అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే సౌమ్య ఔటేనని ఫోర్త్ అంపైర్ ప్రకటించాడు. అంపైర్పై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లవర్షం కురిపిస్తున్నారు.
|
రోహిత్ మెరుపు ఇన్నింగ్స్:
రెండో టీ20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. మహ్మద్ నయీమ్ (31 బంతుల్లో 5 ఫోర్లతో 36) టాప్ స్కోరర్. చాహల్కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. శిఖర్ ధావన్ (27 బంతుల్లో 4 ఫోర్లతో 31) ఫర్వాలేదనిపించాడు. అమినుల్కు రెండు వికెట్లు దక్కాయి.