నిన్నటి మ్యాచ్లో ముంబై గెలవడానికి ఢిల్లీ ప్లేఆఫ్ చేరకుండానే ఇంటి బాట పట్టడానికి ప్రధాన కారణం టిమ్ డేవిడ్. ఈ మ్యాచ్ చివర్లో 11 బంతులను మాత్రమే ఎదుర్కొన్న టిమ్ డేవిడ్ 34పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ మొత్తాన్నీ మలుపు తిప్పేశాడీ సింగపూర్-ఆస్ట్రేలియన్ క్రికెటర్. అయితే తాను ఎదుర్కొన్న తొలి బంతికే టిమ్ డేవిడ్ అవుట్ అయ్యాడు గానీ.. ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డీఆర్ఎస్ కోరుకోకపోవడం వల్ల బచాయించిపోయాడు. దీంతో మ్యాచ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక డీఆర్ఎస్ కోరుకోకపోవడంపై పంత్ పట్ల ట్రోల్స్, నిందలు, కామెంట్లు పెరిగాయి. ఈ క్రమంలో పంత్ను పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా రోహిత్ శర్మ సైతం పంత్కు సపోర్ట్గా మాట్లాడాడు.
'అతనో క్వాలిటీ కెప్టెన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇదివరకు జరిగిన సీజన్లలో అతనెలా కెప్టెన్సీ చేశాడో మనం చూశాం. కొన్నిసార్లు మనం అనుకున్నట్లు అన్ని జరగవు. ఇక పంత్ చేసిన మిస్టేక్స్ చాలా సింపుల్ విషయం అని రోహిత్ శర్మ చెప్పాడు. నేను ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. నేను అదే విషయం గురించి అతనికి చెబుతున్నా. ఈ రకమైన మిస్టేక్స్ అప్పుడప్పుడు జరుగుతాయి. అది ఊహించనట్లు జరగలేదంతే. కాబట్టి ఇందులో తప్పేమీ లేదని' రోహిత్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం పంత్తో తాను మాట్లాడినట్లు రోహిత్ పేర్కొన్నాడు.