తొలి టెస్టులోనూ సిక్స్తో
కెరీర్ తొలి టెస్టులోనూ సిక్స్తో రిషబ్ పంత్ తన పరుగుల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. కాగా, కెరీర్లో మూడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్ తొలి సెంచరీతో 2007లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నెలకొల్పిన రెండు రికార్డులను బద్దలు కొట్టాడు.
11 ఏళ్ల క్రితం ధోని నెలకొల్పిన రికార్డు బద్దలు
ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు 92. ఓవల్ స్టేడియంలో ఈ రికార్డుని ధోని 11 ఏళ్ల క్రితం ఈ రికార్డుని నెలకొల్పాడు. అలానే, టెస్టు మ్యాచ్ చివరి ఇన్నింగ్స్లో భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు 76. లార్డ్స్ వేదికగా 2007లో ధోనీ ఈ పరుగులు చేశాడు.
ఓవల్ స్టేడియంలో రిషబ్ పంత్ సెంచరీ
తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన సెంచరీతో ఈ రెండు రికార్డులనీ బద్దలుకొట్టి.. సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే ఐదో టెస్టులో టీమిండియా 118 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లాండ్ పర్యటనని భారత్ జట్టు ఓటమితో ముగించింది.
సెంచరీలతో మెరిసిన రాహుల్, పంత్
464 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టులో లోకేశ్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) సెంచరీతో మెరిసినా.. మిగతా బ్యాట్స్మెన్ విఫలం కావడంతో కోహ్లీసేన ఓడిపోయింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను టీమిండియా 1-4తో చేజార్చుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్కి కెరీర్లో ఇదే చివరి టెస్టుకాగా.. ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి ఈ టెస్టుతో అరంగేట్రం చేశాడు.