తొలి భారత వికెట్ కీపర్గా
మూడు వన్డేల్లో 41 పరుగులు, 8 టీ20ల్లో 114 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. ఇక, వికెట్ కీపింగ్ విషయానికి వస్తే పంత్ మొత్తం 40 క్యాచ్లు అందుకోవడంతోపాటు రెండు స్టంపింగ్స్ చేశాడు.
ఆసీస్ పర్యటనలో అద్భుత ప్రదర్శన
ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్లో 11 క్యాచ్లు అందుకొని ఒక మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న రికార్డును సైతం రిషబ్ పంత్ సృష్టించాడు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనతో పంత్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
సిడ్నీ టెస్టులో సెంచరీ
ఇంగ్లాండ్తో ఓవల్లో వేదికగా జరిగిన ఐదో టెస్టులో పంత్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 20 క్యాచ్లు అందుకోవడంతో పాటు 350కిపైగా పరుగులు సాధించాడు. సిడ్నీ టెస్టులో పంత్ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
|
ఐసీసీ టెస్టు జట్టు
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్లో ముగ్గురు భారతీయలుు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.