పాఠాలు నేర్చుకోవాలి
"చేసిన తప్పుల నుంచి అతడు పాఠాలు నేర్చుకోవాలి. పంత్ వయస్సు 22 ఏళ్లు అంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నా. అతడికి 24-25 ఏళ్లు ఉంటాయని భావించా. ప్రస్తుతం అతడికి పరిణితి చెందడానికి కొంత సమయం ఇవ్వాలి. అతడికి 27-30 ఏళ్లు వచ్చే సరికే అతడిలో అసలైన ఆట వెలుగు చూస్తుంది" అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
అతడిపై ఉన్న నమ్మకంతో
"అతను చేసిన అన్ని తప్పిదాలు, అతడిపై ఉన్న నమ్మకంతో ఆటు జట్టుతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో భారత క్రికెట్కు రిషబ్ పంత్ కచ్చితంగా సూపర్స్టార్ అవుతాడు" అని పీటర్సన్ తెలిపాడు. మరోవైపు విండిస్ క్రికెట్ దిగ్గజం బ్రయన్ లారా కూడా పీటర్సన్ అభిప్రాయంతో ఏకీభవించాడు.
పంత్పై అధిక ఒత్తిడి
"పంత్పై అధిక ఒత్తిడి ఉంది. ఎంతో ఆసక్తితో పంత్ ఈ గేమ్లోకి వచ్చాడు. ఎంతో దూకుడిని కలిగి ఉన్నాడు. ధోనీ స్థానాన్ని భర్తీ చేయాలని, ఆ స్థానంలో పంత్ను క్రికెట్ అభిమానులు అప్పుడే ఊహించుకుంటున్నారు. కానీ, ధోని భిన్నమైన ఆటగాడు. టీ20 వరల్డ్ కప్కు ఇంకా 8 నుంచి 9 నెలల సమయం ఉంది. టీమిండియా మరో వికెట్ కీపర్తో బరిలోకి దిగవచ్చు" అని లారా అన్నాడు.
కోహ్లీ అండగా
"ఇది పంత్పై మరింత ఒత్తిడి తీసుకువస్తుంది. పంత్కు కోహ్లీ అండగా నిలవడం సరైన నిర్ణయమే. టీమిండియా విజయవంతమైన జట్టు. 30 ఏళ్ల ముందు విండిస్ జట్టు కూడా ఆటగాళ్లు రాణించకపోయినా జట్టులో కొనసాగించేది. ఎందుకంటే జట్టుగా విండీస్ విజయాలను నమోదు చేసేది" అని లారా అన్నాడు.
గుస్ లోగీ లేదా కార్ల్ హూపర్ వంటి
"వెస్టిండిస్ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మీరు గుస్ లోగీ లేదా కార్ల్ హూపర్ వంటి ఆటగాళ్ల పేర్లు ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే వారు అంతగా రాణించకపోయినా.... కానీ, జట్టు మేనేజ్మెంట్ వారికి తగినంత సమయం ఇచ్చింది. రిషబ్ పంత్ కూడా పరిణితి చెందడానికి కొంత సమయం ఇవ్వాలి" అని లారా పేర్కొన్నాడు.