హైదరాబాద్: జనవరి 26.... ఆదివారం నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ట్విట్టర్లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ సందర్బంగా పాంటింగ్ను ఆల్టైమ్ టాప్-3 బెస్ట్ ఫీల్డర్లు ఎవరు? అని ఓ నెటిజన్ అడిగాడు. ఈ ప్రశ్నకు పాంటింగ్ సమాధానంగా జాంటీ రోడ్స్, ఏబీ డివిలియర్స్, ఆండ్రూ సైమండ్స్ల పేర్లను పాంటింగ్ సూచించాడు.
Andrew Symonds, AB de Villiers, Jonty Rhodes https://t.co/GvOd3eXCSe
— Ricky Ponting AO (@RickyPonting) January 27, 2020
జాంటీ రోడ్స్, ఏబీ డివిలియర్స్లు దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్లు కాగా... ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ కావడం విశేషం. ఈ ముగ్గురూ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత రికీ పాంటింగ్ కామెంటేటర్గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్గా ఉన్నారు.
బీబీఎల్లో ఊహించని ఘటన.. ఎప్పుడూ చూడని రీతిలో రనౌట్ (వీడియో)!!
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గాయపడి కాంకషన్ గురైన పంత్.. మళ్లీ తుదిజట్టులోకి రాలేదు. అతని స్థానంలో కీపింగ్ బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు కీపింగ్.. ఇటు బ్యాటింగ్లో అదరగొడుతున్నాడు. దీంతో టీమ్మేనేజ్మెంట్ కూడా రాహుల్నే కొనసాగిస్తుంది. దీంతో ఈ యువ వికెట్ కీపర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
'ప్రపంచంలోని అత్యుత్తమ డెత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు'
ఈ విషయాన్ని కొందరు అభిమానులు రికీ పాంటింగ్ దృష్టికి తీసుకెళ్లగా.. టీమిండియా కీపర్ రిషబ్ పంతేనని స్పష్టం చేశాడు. 'అపారమైన నైపుణ్యాలు రిషబ్ పంత్ సొంతం. త్వరలోనే అతను కచ్చితంగా టీమిండియా తుది జట్టులోకి వస్తాడు. ఐపీఎల్ నేపథ్యంలో అతనితో మళ్లీ పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా" అని రికీ పాంటింగ్ వెల్లడించాడు.