ఆస్ట్రేలియా క్రికెట్కు ఒక మచ్చగా
ఇలాంటి సంఘటనలు ఆస్ట్రేలియా క్రికెట్కు ఒక మచ్చగా మిగిలిపోతాయని చెప్పుకొచ్చింది. ఇకనుంచైనా అటువంటి అనుచిత ప్రవర్తనను కట్టిపెట్టి మర్యాదగా ప్రవర్తించాలని ఆసీస్ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్స్ మాట్లాడుతూ "దేశానికి వచ్చిన అతిథులను ఇలా అవమానించడం సరికాదు. అతిథులను గౌరవించడం నేర్చుకోవాలి" అని అన్నాడు.
ఆట మనందరికంటే పెద్దది
"ఆట మనందరికంటే పెద్దది. మనం అతిథుల్ని గౌరవించాలి. మన దేశంలో పర్యటించే వారికి ఉత్తమ అనుభవాన్ని ఇవ్వాలి. మైదానంలో వారిని ఓడించాల్సిందే కానీ.. అదే సమయంలో వారితో గౌరవప్రదంగా వ్యవహరించాలి" అని ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్స్ పేర్కొన్నాడు. ఇలాంటి చర్యలను పునరావృతం చేయవద్దని అభిమానులకు హితవు పలికాడు.
తొలి టెస్టులో కూడా ఇలానే
కాగా, ఈ సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చిన సమయంలో ఆసీస్ ప్రేక్షకులు గేలి చేసిన సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆసీస్ అభిమానులు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని గేలి చేస్తుంటే... కోహ్లీకి గౌరవం ఇవ్వాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిమానులను కోరిన సంగతి తెలిసిందే.
రికీ పాంటింగ్ సైతం
‘అతనిపై అభిమానం ఉండి అరిస్తే పరవాలేదు. అలా కాకుండా అవమానకరంగా అరిస్తే మాత్రం సహించను. నిజంగానే ఎస్సీజీలో అలా జరిగితే అవమానకరంగా భావిస్తాను. ఇప్పటికే నేను పెర్త్ టెస్టులో జరిగిన దానిపై తప్పంటూ సూచించాను. టీమిండియా కెప్టెన్ కోహ్లీని గౌరవించడం నేర్చుకోండి' అంటూ పాంటింగ్ అభిమానులకు సూచించాడు.