హైదరాబాద్: శ్రీలంక క్రికెట్లో చీదరించుకునే వాతావరణం నెలకొందని ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011 వరల్డ్ కప్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటూ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
శ్రీలంక జట్టు ఆడే మ్యాచ్లను చూడనంటూ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ పరిపాలనలోఉన్న అసహ్యకర వాతావరణమే తనను తమ మ్యాచ్లు చూడకుండా చేస్తోందని రణతుంగ పేర్కొన్నాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగున్న టెస్టు సిరీస్ను చూస్తున్నానని రణతుంగ పేర్కొన్నాడు. శ్రీలంక క్రికెట్లో ప్రక్షాళన కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఆ దేశ ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు రణతుంగ లేఖ రాస్తానని వెల్లడించారు.
దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు అయిన నాలుగో టెస్టు ఆగస్టు 4న ప్రారంభం కానుంది. లంక తరుపున 93 టెస్టులాడిన రణతుంగ 5,105 పరుగులు చేయగా, 269 వన్డేల్లో 7,456 పరుగులు చేశాడు.