ఐపీఎల్లో కేకేఆర్ తరుపున
ఈ నేపథ్యంలో ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరుఫున ఆడుతోన్న లోకీ ఫెర్గుసన్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ సూపర్ స్టార్. ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడటానికి భారత జట్టుకు ఆడటానికి చాలా తేడా ఉంటుంది" అని ఫెర్గుసన్ అన్నాడు.
వరల్డ్కప్పై ఉండదు
"ఆర్సీబీ ప్రదర్శన ప్రభావం వరల్డ్కప్పై ఉండదు. అదొక భిన్నమైన జట్టు.. భిన్నమైన ఫార్మాట్. అంతేకాదు వరల్డ్కప్ అనేది ఓ ప్రత్యేకమైన టోర్నమెంట్. కాబట్టి, అక్కడ విరాట్ కోహ్లీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకుంటే విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తాడు" అని ఫెర్గుసన్ చెప్పుకొచ్చాడు.
వరల్డ్కప్ భిన్నమైన టోర్నీ
"టీ20 క్రికెట్లో కెప్టెన్గా కోహ్లీ పెద్దగా విజయాలను నమోదు చేయలేదు. అయితే, వరల్డ్కప్లో కూడా అలాంటి ఫలితాలే వస్తాయని చెప్పలేం" అని ఫెర్గుసన్ అన్నాడు. ఇక, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్పై ఫెర్గుసన్ ప్రశంసలు కురిపించాడు. "టీ20లు ఆడేందుకు ధావన్ న్యూజిలాండ్ పర్యటనకు వచ్చాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున రాణిస్తున్నాడు" అని అన్నాడు.
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్కప్ ఆరంభం
ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్కప్ మే30 నుంచి ఆరంభం కానుంది. ఈ వరల్డ్కప్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో జట్టుని ప్రకటించింది. తాజాగా, బీసీసీఐ కూడా 15 మందితో కూడిన జట్టుని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.