వరల్డ్ కప్ మాత్రమే గుర్తుంటుంది
'ప్రస్తుతం టీ20 క్రికెట్లో దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు బాగా జరుగుతున్నాయి. ఎక్కువగా ద్వైపాక్షిక సిరీస్లు జరగడాన్ని నేను టీమిండియాకు కోచ్గా ఉన్నప్పుడు కూడా నా కళ్లారా చూశా. టీ20 క్రీడా ఫుట్బాల్ మాదిరిలో జరగాలి. టీ20 క్రికెట్లో కేవలం ప్రపంచకప్ మాత్రమే ఆడాలి. ద్వైపాక్షిక టోర్నమెంట్లు నిర్వహించినా అవి ఎవరు గుర్తుపెట్టుకోరు' అని రవిశాస్త్రి చెప్పాడు. 'ప్రపంచ కప్ మినహా గత ఆరేడేళ్లలో భారత కోచ్గా నాకు ఒక్క టీ20 ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ కూడా గుర్తులేదు. కానీ వరల్డ్ కప్ మాత్రం గుర్తుంటుంది. ఏదో ఒక జట్టు ప్రపంచకప్ గెలిచి విజేతగా నిలుస్తుంది. అలా వరల్డ్ కప్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరూ వరల్డ్ కప్ గుర్తుంచుకుంటారు.' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ద్వైపాక్షిక సిరీస్లు తగ్గిస్తే
'ద్వైపాక్షిక సిరీస్లను తగ్గిస్తే మీరు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కువగా ఆడడానికి స్కోప్ ఉంటుంది. ప్రతి దేశం వారి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ కలిగి ఉండటానికి వీలుంటుంది. అది వారి దేశీయ క్రికెట్కు, అంతర్జాతీయ క్రికెట్కు ఉపయోగపడుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకు దేశాల మధ్య ప్రపంచ కప్ నిర్వహిస్తే మంచిది' అని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని పేర్కొన్నాడు.
ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించొచ్చు
ఇక ఐపీఎల్ భవితవ్యంపై ఆయన మాట్లాడుతూ.. 'ఐపీఎల్ లాంటి టోర్నీలదే భవిష్యత్తు. భవిష్యత్తులో ఒక ఏడాదిలో రెండు ఐపీఎల్ టోర్నీలు కూడా జరిగే అవకాశముంది. మొత్తం 140గేమ్లు, 70 - 70గా విభజించి అయిన ఒకే ఐపీఎల్ నిర్వహించే వీలుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ వంటి టోర్నీలను ప్రేక్షకులు ఆదరిస్తున్న క్రమంలో దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం పెద్ద ప్రభావవంతంగా ఉండదు. వాటిని ఎవరూ గుర్తుంచుకోరని రవిశాస్త్రి ఖరాఖండిగా చెప్పేశాడు.