పర్యటన ముందు 2 వార్మప్ మ్యాచ్లు
‘నేను ఎక్కువ సంఖ్యలో ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడటం వల్ల ఎంతో ప్రయోజనం పొందా. ఐతే ఇప్పుడు షెడ్యూల్లు మారిపోయాయి. పరిస్థితులు కఠినతరంగా మారాయి. అయినప్పటికీ ఏ విదేశీ పర్యటనకు ముందు అయినా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడటం కచ్చితంగా మేలు చేస్తుంది'అని అతనన్నాడు. భారత క్రికెటర్లు మామూలుగానే టెస్టు క్రికెట్ కోసం సాధన చేయడం తగ్గిపోతోందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
దశల వారీగా సాధించేందుకు
ప్రస్తుతం అండర్ 19.. భారత్ ఏ జట్లకు కోచ్గా వ్యవహరిస్తోన్న ద్రవిడ్ను జట్ల పురోగతి గురించి ప్రశ్నించగా.. 'క్రమంగా మెరుగుపడుతోంది. ఒకట్రెండు సంవత్సరాల్లో జరిగేది కాదు కదా. పటిష్టంగా చేయడానికి ఎక్కువ సమయమే పట్టేటట్లుగా కనిపిస్తోంది. దశల వారీగా వృద్ధి సాధించేందుకు కష్టపడుతున్నాం. ఏటా ఫలితాల్లో కచ్చితంగా మెరుగు సాధిస్తాం.
వైట్ బాల్ క్రికెట్కైతే రాణించగలిగేంత
రంజీ ట్రోఫీల్లో ఆడితే టీమిండియాలో నేరుగా స్థానం దక్కించుకోవడమనేది పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్కైతే రాణించగలిగేంత సన్నద్ధంగా లేం. కానీ, రెడ్ బాల్ క్రికెట్కు మాత్రం ఆకస్మికంగా అందించేందుకు క్రికెటర్లను సిద్ధంగానే ఉంచాం. కొద్ది విరామం తర్వాత మళ్లీ నైపుణ్యాన్ని సాన బెట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నాం.
ఇప్పటి తరం క్రికెటర్లు మెరుగైన ప్రతిభ
భవిష్యత్లో ఇంకొన్ని ఛాలెంజ్లు ఎదురుకావచ్చు. టీమిండియాలో ఆడేందుకు అరుదుగా అవకాశాలు వస్తాయి. ఒక్కోసారి మనం చాలా కష్టపడి.. బాగా ఆడినా అదృష్టం కలిసి రాకపోతే చేసేదేం ఉండదు. కేవలం మన చేతిలో ఉండేది. అయినా ఇప్పటి తరం క్రికెటర్లు గతం కంటే మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారు,.