అదో గొప్ప విషయం..
రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్తో చిట్ చాట్ చేసిన శ్రీధర్.. ఆసీస్ పర్యటన విశేషాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా సిరాజ్ను ప్రత్యేకంగా కొనియాడాడు. 'తన తండ్రి మరణవార్త తెలిసిన తర్వాత సిరాజ్ చాలా బాధపడ్డాడు. ఆ టైమ్లో క్వారంటైన్ రూల్స్ కారణంగా మేం అతని గదిలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దాంతో, తను సరిగ్గా తింటున్నాడో లేదో కనుక్కునేందుకు నేను, విహారి రోజు వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాళ్లం. అంత కష్టకాలంలోనూ సిరాజ్ జట్టుతోనే ఉండాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం.
నా అత్తగారిల్లు కాదు..
భారత్కు ఆడాలని సిరాజ్ చాలా పట్టుదలగా ఉండేవాడు. రెండేళ్ల నుంచి భారత్-ఎ తరఫున బాగా రాణించినప్పుడుల్లా నాకు ఫోన్ చేసేవాడు. సర్ నన్నెప్పుడు జట్టులోకి పిలుస్తున్నారు అనేవాడు. నేనేమో.. నా ఇష్టం వచ్చిన వాళ్లను పిలవడానికి అదేమైనా నా అత్తగారిల్లా.. అని నవ్వుకునేవాడిని. కానీ తన తండ్రి మరణం తర్వాత సిరాజ్ చూపించిన నిబ్బారినిక హ్యాట్సాఫ్.'అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పర్యటనలో మెల్బోర్న్ టెస్ట్తో సుదీర్ఘ ఫార్మాట్ను ప్రారంభించిన సిరాజ్ 3 మ్యాచ్ల్లో 13 వికెట్లతో సత్తా చాటాడు.
పంత్.. ప్లాన్ మార్చేశాడు..
జట్టు ప్రణాళికను యువ వికెట్ కీపర్ రిషభ్ మార్చేశాడని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. 'తొలుత డ్రా కోసం పోరాడాలి, ఆఖరి పది ఓవర్లలో విజయం కోసం గేర్ను మార్చాలి' అనేది జట్టు ప్రణాళిక. కానీ పంత్ బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ గమనాన్ని మార్చాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ప్రదర్శన కీలకం. ఎన్నో ప్రతికూలతల్లో అతడు అయిదు వికెట్లు పడగొట్టాడు. జట్టు మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వాలి.
శార్దూల్ కవర్ డ్రైవ్స్ సూపర్..
తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయాం. ఈ దశలో సుందర్తో కలిసి శార్దూల్ ఇన్నింగ్స్ గొప్పగా నిర్మించాడు. శార్దూల్ బ్యాటింగ్ ఆడిన తీరు అద్భుతం. అతను ఆడిన కవర్డ్రైవ్స్ సిరీస్లోనే హైలైట్గా నిలిచాయి. అందుకే అతనికి అశ్విన్.. 'శార్దులకర్' అని నిక్నేమ్ పెట్టాడు. సచిన్లా అతను కవర్డ్రైవ్స్ ఆడాడు. ఆసీస్ పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్ బౌలింగ్లో బౌండరీలు సాధించాడు. సుందర్ కూడా గొప్పగా ఆడాడు' అని శ్రీధర్ ప్రశంసించాడు.