పృథ్వీ షా సలహాలు:
తాజాగా అండర్-19 కోచ్ పరాస్ మహంబ్రే, కెప్టెన్ ప్రియమ్ గార్గ్ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియమ్ గార్గ్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ సర్ను ఇంకా కలవలేదు. పృథ్వీ షాతో మాత్రం మాట్లాడాను. టైటిల్ సాధించాలంటే ప్రణాళిక, ఆటగాళ్ల మధ్య అనుబంధం అత్యంత కీలమని చెప్పాడు. మొదటగా ఆటగాళ్ల బలాలేంటో గుర్తించాలని సూచించాడు. 2018లో ప్రపంచకప్ గెలవడంలో ఆటగాళ్ల మధ్య అనుబంధమే కీలక పాత్ర పోషించిందనని చెప్పాడు' అని ప్రియమ్ గార్గ్ తెలిపాడు.
మాపై ఒత్తిడేమీ లేదు:
'ఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్న మాపై ఒత్తిడేమీ లేదు. అంతపెద్ద టోర్నీలో జట్టుకు సారథ్యం వహించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు అందరం కలిసి చాలా టోర్నీల్లో ఆడాం. సారథిగా జట్టును ముందుకు తీసుకెళ్లడం, కఠిన పరిస్థితుల్లో నడిపించడం గురించి ఆలోచిస్తున్నా. మంచి ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం' అని ప్రియమ్ గార్గ్ పేర్కొన్నాడు.
జట్టు సమతూకంగా ఉంది:
ప్రస్తుత జట్టులో కావాల్సినంత సమతూకం ఉందని కోచ్ పరాస్ మహంబ్రే అన్నాడు. 'సన్నాహక మ్యాచుల్లో కూర్పుపై ప్రయోగాలు చేస్తాం. జట్టులో బలమైన బ్యాట్స్మెన్, బౌలర్లు, ఆల్రౌండర్లు ఉన్నారు. కఠిన పరిస్థితుల్లో అందరూ రాణించగలరు. జట్టు సమతూకంగా ఉంది. మెం కచ్చితంగా టైటిల్ సాధిస్తాం' అని మహంబ్రే ధీమా వ్యక్తం చేసాడు. అండర్-19 ప్రపంచకప్ జట్టులో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకి చోటు దక్కింది. తిలక్ జట్టులో ప్రముఖ బ్యాట్స్మన్గా కొనసాగనున్నాడు.
భారత జట్టు:
ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాన్ష్ సక్సేనా, శషావత్ రావత్, దివ్యాన్ష్ జోషి, శుభంగే హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తిక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమాల్ కుషాగ్ర, సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.