|
ప్రశంసల వర్షం:
సరిగ్గా గత ఏడాది జూలైలో అండర్20 వరల్డ్ ఛాంపియన్ షిప్లో 400 మీ పరుగులో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన దాస్.. సంవత్సరం తిరిగే సరికి ఐదు స్వర్ణాలు సాధించింది. ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు సాధించిన హిమదాస్పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, యువ క్రికెటర్ రిషభ్ పంత్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెండుల్కర్లు కొనియాడారు.
|
దేశం గర్విస్తోంది:
'గత కొన్ని రోజులుగా అద్భుత విజయాలు సాధిస్తున్న హిమదాస్ను చూసి దేశం గర్విస్తోంది. దేశం తరఫున ఐదు అంతర్జాతీయ స్వర్ణాలను సాధించినందుకు అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందలు. భవిష్యత్తులో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని ట్వీట్ చేశారు.
|
సలామ్ బాస్:
'నువ్వు ఒక స్ఫూర్తి. ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా. సలామ్ బాస్' అని రిషభ్ పంత్ కొనియాడాడు. 'గత 19 రోజులుగా యూరోపియన్ సర్క్యూట్లో నీ ప్రదర్శన చూసి గర్విస్తున్నాం. గెలవాలనే పట్టుదల యువతకు ఒక స్ఫూర్తి. ఐదు పతకాలు గెలిచినందుకు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నా' అని సచిన్ ట్వీటారు.
|
నువ్వు ప్రత్యేకం:
'ఇది నమ్మశక్యం కాని ముగింపు. 400 మీటర్లలో అసాధ్యమైన ఫీట్!. అమేజింగ్.. అమేజింగ్.. అమేజింగ్. హిమదాస్.. నువ్వు ప్రత్యేకం!!' అని అమితాబ్ పేర్కొన్నారు. హిమదాస్ పాంజ్సన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్, కుట్నో అథ్లెటిక్ మీట్, క్లాడ్నో అథ్లెటిక్ మీట్, టాబోర్ అథ్లెటిక్ మీట్, చెక్ రిపబ్లిక్ అథ్లెటిక్స మీట్లలో స్వర్ణాలను సాధించింది.