
613/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్
ఇక, ఈ టెస్టులో భారత్ 128.5 ఓవర్లలో 613/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 428/4తో బుధవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ను శ్రీలంక బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 177తో క్రీజులోకి వచ్చిన పవన్ షా రెండో రోజు కూడా తన దూకుడిని కొనసాగించాడు.

అలవోకగా డబుల్ సెంచరీ పూర్తి
అలవోకగా డబుల్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ట్రిపుల్ సెంచరీ దిశగా సాగాడు. కానీ, ట్రిపుల్ సెంచరీకి సమీపంలో రనౌటై కొద్దిలో చేజార్చుకున్నాడు. పవన్ షా.. వధేరా (64)తో నాలుగో వికెట్కు 160 పరుగులు జోడించాడు. యూత్ టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా పవన్ షా నిలిచాడు.

భారత్ తరుపున తొలి డబుల్ సెంచరీ తన్మయ్ శ్రీవాత్సవ్దే
సెప్టెంబర్ 2006లో పాకిస్థాన్తో పెషావర్ వేదికగా జరిగి టెస్టులో తన్మయ్ శ్రీవాత్సవ్ (220) పరుగులతో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు, లంక సీమర్ విచిత్ర పెరీరా వేసిన ఇన్నింగ్స్ 108వ ఓవర్లో పవన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. దీంతో పవన్ షా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 1982 తర్వాత ఒకే ఓవర్లో ఆరు బౌండరీలు బాదిన ఆటగాడిగా నిలిచాడు.

1982 తర్వాత ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు
1982లో మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్లో బాబ్ విల్లీస్ బౌలింగ్లో సందీప్ పాటిల్ ఆరు బంతుల్లో ఆరు బౌండరీలు బాదాడు. ఈ ఓవర్లో పాటిల్ బౌండరీల దెబ్బకు బాబ్ విల్లీస్ ఏడు బంతులు వేశాడు. ఇందులో ఒక నో బాల్ ఉండటం విశేషం. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక బుధవారం ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications












