విండిస్ చేతిలో ఘోర ఓటమే
విండిస్ చేతిలో ఘోర ఓటమే తమ జట్టు సెమీస్ చేరకపోవడానికి ప్రధాన కారణమనికోచ్ మికీ ఆర్థర్ తెలిపాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గెలిచే అవకాశమున్నా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామని ఆర్థర్ తన ఆవేదన వెళ్లగక్కాడు. ఈ రెండు ఓటములే తనకు పీడకలలా మిగిలిపోతాయని అన్నాడు.
మికీ ఆర్థర్ మాట్లాడతూ
మికీ ఆర్థర్ మాట్లాడతూ "విండిస్ చేతిలో ఘోర పరాభవం చూడటం పాక్ జట్టు సెమీస్ అవకాశాల్ని దెబ్బ తీసింది. ఇక ఆసీస్తో మ్యాచ్లో కూడా మేము గెలవాల్సిన ఉన్నా అది జరగలేదు. పేలవ ప్రదర్శనతోనే మా సెమీస్ దారులు మూసుకుపోవడం చాలా బాధాకరం. మళ్లీ మేం గాడిలో పడినప్పటికీ నెట్ రన్రేట్తో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది" అని అన్నాడు.
మా డ్రెస్సింగ్ రూమ్ నిరుత్సాహపరిచింది
"ఇది మా డ్రెస్సింగ్ రూమ్ నిరుత్సాహపరిచింది. బంగ్లాదేశ్పై గెలిచిన తర్వాత కూడా మేము అభినందనలు చెప్పుకోలేకపోయాం. అయితే ఈ టోర్నీలో సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లని పాకిస్థాన్ జట్టు ఓడించడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా సెమీస్ రేసులో ఉన్న నాలుగు జట్లకు అభినందనలు. వారు మంచి క్రికెట్ ఆడిన కారణంగానే సెమీస్కు వెళ్లారు. అత్యుత్తమ జట్టునే ట్రోఫీ వరిస్తుంది" అని ఆర్థర్ అన్నాడు.
బంగ్లాతో జరిగిన మ్యాచ్లో తొలి పది ఓవర్లలో
బంగ్లాతో జరిగిన మ్యాచ్లో తొలి పది ఓవర్లలో శుభారంభం లభిస్తే 400పైగా స్కోర్ చెయ్యాలని అనుకున్నామని... అయితే ఫకార్ జమాన్ ఔటైన తర్వాత బ్యాటింగ్ కష్టంగా ఉందని ఆర్థర్ చెప్పాడు. అప్పుడు 270 పరుగులు చేసి బంగ్లాను కట్టడి చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ పిచ్పై 400 పరుగులు చెయ్యడమంటే ఆత్యాశే అవుతుందని ఆర్థర్ చెప్పుకొచ్చాడు.