షాహిద్ అఫ్రిది తన అక్కసుని ట్విట్టర్లో
అంతకముందు ఆర్టికల్ 370 రద్దుపై భారత ప్రభుత్వం తీరుని తప్పుబడుతూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తన అక్కసుని ట్విట్టర్లో వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని... ఆర్టికల్ 370 రద్దు జరుగుతుంటే ఐక్యరాజ్యసమితి నిద్రపోతుందా? అంటూ ట్విట్టర్లో ప్రశ్నించాడు.
నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు: లార్డ్స్లో టెస్టు అరంగేట్రంపై జోఫ్రా ఆర్చర్
|
కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు
"ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. స్వేచ్చ విషయంలో అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. ఇంత జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు స్పందించట్లేదు. అసలు ఐక్యరాజ్య సమితిని ఎందుకు ఏర్పాటు చేశారు? కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి" అంటూ అఫ్రిది తన ట్వీట్టర్లో పేర్కొన్నాడు.
|
ఘాటుగా స్పందించిన గంభీర్
అఫ్రిది ట్విట్టర్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. "అఫ్రిది.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాస్తవమే. ఈ విషయాన్ని అంగీకరించిన నిన్ను అభినందించాల్సిందే. కానీ నువ్వు మరిచిపోయిన విషయం ఏంటంటే.. ఇవన్నీ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో జరుగుతున్నాయని ప్రస్తావించకపోవడం. ఏం బాధపడకు త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం" అంటూ గంభీర్ తనదైన శైలిలో అఫ్రిదికి సమాధానమిచ్చాడు.