కోహ్లీకి చెత్త బంతులు వేస్తే
"కోహ్లీకి చెత్త బంతులు వేస్తే వాటిని బౌండరీ ద్వారానే సమాధానం చెబుతాడు. తాము తమ ప్రణాళికల్ని అమలు చేసే ఉంటే అసలు ఈ చర్చే ఉండేది కాదు. ఈ మ్యాచ్లో విజయానికి భారత్కు అన్ని అర్హతలు ఉన్నాయి. తాము టీ20 సిరీస్ను మొదలు పెట్టినప్పుడు సిరీస్ ఫలితం చివరి వరకూ వెళుతుందని అనుకోలేదు" అని పొలార్డ్ తెలిపాడు.
240 పరుగులు పెద్ద స్కోరేమీ కాదు
"భారత్ చేసిన 240 పరుగులు పెద్ద స్కోరేమీ కాదు. తమ చేతుల్లో వికెట్లు ఉండి ఉంటే కచ్చితంగా గెలిచి ఉండేవాళ్లం. తమ బ్యాట్స్మెన్ మరింత నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. వన్డే సిరీస్లో ప్రణాళికల్ని అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాం" అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు.
173 పరుగులకే పరిమితమైన విండిస్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు భారత జట్టులో రోహిత్ శర్మ (34 బంతుల్లో 71), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 91) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది.
ఆదివారం నుంచి మూడు వన్డేల సిరిస్
దీంతో టీమిండియా మూడు టీ20ల సిరిస్ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకముందు హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా... తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.