మ్యాచ్లో విరాట్ గాయపడ్డాడని
ఐపీఎల్లో భాగంగా మే17న జరిగిన బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ గాయపడ్డాడని బోర్డు తెలిపింది. స్కానింగ్, ఇతర వైద్య పరీక్షల అనంతరం మెడికల్ టీం ఈ విషయాన్ని నిర్ధారించిందని బీసీసీఐ వివరించింది. బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో విరాట్ కోహ్లి చికిత్స పొందనున్నాడు.
ఫిట్నెస్ టెస్టులో పాల్గొననున్న కోహ్లి
జూన్ 15న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోహ్లి ఫిట్నెస్ టెస్టులో పాల్గొననున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని బీసీసీఐ మెడికల్ టీం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
ఏడాది కాలంగా విరాట్ కోహ్లి తీవ్ర పని ఒత్తిడి
ఏడాది కాలంగా విరాట్ కోహ్లి తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. సంవత్సర కాలంలో 9 టెస్టులు, 29 వన్డేలు, 9 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. కోహ్లి ఏడాదిలో మొత్తం 47 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. భారత ఆటగాళ్లలో రోహిత్, హార్దిక్ మాత్రమే అతడి కంటే ఒక మ్యాచ్ ఎక్కువ ఆడారు.
జూలై మొదటి వారంలో భారత జట్టు:
ఇంగ్లాండ్ వాతావరణానికి అలవాటు పడేందుకు.. సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున మూడు లిస్ట్ ఏ, మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడేందుకు కోహ్లి ఒప్పందం చేసుకున్నాడు. జూలై మొదటి వారంలో భారత జట్టు ఇంగ్లాండ్లో టీ20 మ్యాచ్లు ఆడనుంది.