అసలేం జరిగింది?
బంగ్లా ఇన్నింగ్స్ 13 ఓవర్ను స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వేస్తున్నాడు. చహల్ వేసిన ఓ బంతికి సౌమ్య సర్కార్ (30; 2 ఫోర్లు, 1 సిక్స్)ను రిషభ్ పంత్ స్టంపౌట్ చేశాడు. ఫీల్డ్ అంపైర్కు అనుమానం ఉండడంతో థర్డ్ అంపైర్ను ఆశ్రయించాడు. అంపైర్ నిర్ణయం కోసం సౌమ్య సర్కార్ బౌండరీ లైన్ వద్ద నిరీక్షిస్తున్నాడు.
|
సౌమ్య క్లియర్గా ఔట్ అని రిప్లైలో
సౌమ్య క్లియర్గా ఔట్ అని రిప్లైలో తేలినా.. స్క్రీన్ మీద నాటౌట్ అని డిస్ప్లే అయ్యింది. స్క్రీన్ చూసిన రోహిత్ తన సహనాన్ని కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్ పక్కన ఉండగానే థర్డ్ అంపైర్ను అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే సౌమ్య ఔటేనని ఫోర్త్ అంపైర్ ప్రకటించాడు. అంపైర్పై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సిరిస్ 1-1తో సమం
ఇదిలా ఉంటే, మూడు టీ20ల సిరిస్లో భాగంగా రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో సిరిస్ 1-1తో సమం అయింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి టీ20లో గనుక బంగ్లాదేశ్ విజయం సాధిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే టీ20 క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ ఇప్పటివరకు భారత్పై టీ20 సిరిస్ నెగ్గలేదు.