తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసి
ఇది కాస్త వైరల్ అయి దుబాయ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడ పట్ల ఆసీస్ అభిమానులు విమర్శించారు. దీంతో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన స్టేడియం నిర్వాహకులు.. రెండు దేశాల జెండాలు ఒకే రీతిలో ఉండటంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. క్రికెట్లో ఇలాంటి సంఘటనలు జరగటం కొత్తేం కాదు.
భారత జాతీయ జెండాను తలకిందులుగా
గతంలో కూడా ఓ మ్యాచ్లో భారత జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. మ్యాచ్ మధ్యలో ఆ విషయాన్ని గుర్తించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంపైర్లకు చెప్పి సరిచేపించాడు. ఇక ఈ మ్యాచ్లో ఆసీస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. పాక్ సిరీస్లో రాణించి పునర్వైభవం సాధించాలనుకున్న ఆసీస్కు శుభారంభం లభించలేదు.
పాకిస్తాన్ 482 పరుగుల భారీ స్కోర్
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 482 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పసతగ్గిన ఆసీస్ బౌలింగ్పై పాక్ బ్యాట్స్మెన్ పైచేయి సాధించారు. ఓపెనర్ మొహ్మద్ హఫీజ్ (126), హారీస్ సోహైల్ (110) సెంచరీలతో రెచ్చిపోయారు. వీరికి తోడుగా ఇమాముల్ హక్(76), అసద్ షఫీఖ్(80) హాఫ్ సెంచరీలతో రాణించారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి
ఆసీస్ బౌలర్లలో సిడిల్ మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ రెండు వికెట్లు, హోలండ్, స్టార్క్, ల్యాబస్చేంజ్ తలో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో ఆసీస్ ఓపెనర్లు ఖవాజా (17), ఫించ్(13)లు ఉన్నారు.