ఏకాగ్రతలో
"బంతిని పుజారాలా నిశితంగా గమనించే బ్యాట్స్మెన్ను మరొకర్ని చూడలేదు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కూడా అతడికి సాటిరారు. మేం అతడిలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం" అని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల మ్యాచ్ల సిరిస్లో పుజారా టాప్ స్కోరర్గా నిలిచాడు.
521 పరుగులు చేసిన పుజారా
ఈ సిరిస్లో మొత్తం ఏడు ఇన్నింగ్స్లాడిన పుజారా 1,238 బంతులు ఎదుర్కొని 521 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 193 పరుగులు చేసిన త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో పుజారా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
ఇప్పటి వరకూ అత్యధిక బంతులు
ఈ సిరిస్కు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన ఓ టెస్టు సిరీస్లో ఇప్పటి వరకూ అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్గా రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉండగా తాజాగా ఆ రికార్డుని పుజారా అధిగమించాడు. 2003-04లో జరిగిన ఆసీస్ పర్యటనలో ద్రవిడ్ 1,203 బంతులతో ఆ రికార్డ్ని నెలకొల్పగా.. పుజారా 1,258 బంతులతో దానిని బద్దలు కొట్టాడు.
పుజారాదే కీలకపాత్ర
ఈ జాబితాలో మూడో స్థానంలో విజయ్ హజారే (1947-48) 1,192 బంతులతో ఉండగా.. విరాట్ కోహ్లీ (2014-15) 1,093 బంతులు, సునీల్ గవాస్కర్ (1977-78) 1,032 బంతులతో టాప్-5లో ఉన్నారు. ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరిస్ను నెగ్గడంలో పుజారాదే కీలకపాత్ర. పుజారాతో పాటు భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
వన్డేల్లోనూ బలంగా టీమిండియా
ఇక, కోహ్లీసేన టెస్టుల్లో ఉన్నంత బలంగానే వన్డేల్లోనూ ఉందని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు. భారత్ను భారత గడ్డ మీద ఓడించడం తన కెరీర్లో గొప్ప మైలురాయి అని చెప్పిన లాంగర్... విరాట్ కోహ్లి కూడా ఇప్పుడు అలాగే ఫీలవుతున్నాడని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు.