చాన్స్ దక్కకపోవడంపై..
చక్కని బ్యాటింగ్తో ఆకట్టుకుని, సెలక్టర్ల దృష్టిలోనూ పడ్డాడు. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలోనూ 700కు పైగా పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాట్స్మన్గా నిలిచాడు. జాతీయ జట్టులో చోటు కోసం అతను ఎంతగానో శ్రమిస్తున్నాడు. కానీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన 24 మందితో కూడిన జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఫామ్లో ఉన్న అతడిని ఎందుకు తీసుకోలేదంటూ అభిమానులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పడిక్కల్ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
మరో ఏడాది..
అతన్ని జట్టులోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుందన్నాడు. 'దేవదత్ పటిక్కల్ను టెస్టు ఫార్మాట్లోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అతను జట్టులోకి వచ్చే ముందు మరింత బలంగా తయారవ్వాలి. ఇందుకోసం మరో ఏడాది పాటు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది. అతనికి మంచి భవిష్యత్ ఉంది. తప్పకుండా జట్టులోకి వస్తాడు" అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
గతేడాది 15 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 473 పరుగులు చేసిన పడిక్కల్.. అరంగేట్ర సీజన్లోనే 400కు పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది 6 మ్యాచ్లు ఆడిన అతను ఒక సెంచరీతో 195 రన్స్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఈ శతకం బాదాడు.
ప్రాక్టీస్ కోసం..
ప్రసిద్ కృష్ణ, అవేశ్ఖాన్లు స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపికవ్వడంపై స్పందించిన ఎమ్మెస్కే.. వారు కూడా భవిష్యత్తులో జట్టులో చోటు దక్కించుకున్నారని తెలిపాడు. "భారత్ ఏ జట్టులో ప్రసిద్ కృష్ణ మంచి బౌలర్. చాలా రోజులుగా బాగా ఆడుతున్నాడు. అవేశ్ ఖాన్ కూడా ఐపీఎల్లో 145-147కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. కాబట్టి ఇంగ్లండ్లో టీమిండియాతో ప్రాక్టీస్ చేయడానికి వీరి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా వీరు భవిష్యత్లో జట్టుకు ఆడతారు" అని ఎమ్మెస్కే ఆశాభావం వ్యక్తం చేశాడు.
జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్లో న్యూజిలాండ్తో కోహ్లీ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ జరుగుతుంది. కాగా, సెలెక్టర్లు జట్టు ఎంపికలో సంచలనాలకు చోటివ్వలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్పై వేటు పడింది.