మాకెంతో స్వేచ్ఛనిచ్చాడు
తాజాగా ఓ క్రీడాఛానెల్తో మాట్లాడిన మహ్మద్ షమీ తన సారథి విరాట్ కోహ్లీ గురించి పలు విషయాలు పంచుకున్నాడు. 'విరాట్ కోహ్లీ మా పేస్ బౌలింగ్ దళానికి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచాడు. మాకెంతో స్వేచ్ఛనిచ్చాడు. మా ప్రణాళికలు విఫలమైనప్పుడు మాత్రమే అతడు కోపగించుకుంటాడు. లేకపోతే మేం ఏం చేసినా ఏమనడు. ఎప్పుడూ నాపై కానీ, మా బౌలింగ్ యూనిట్పై కానీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాడు. భారత జట్టు పేస్ బౌలింగ్ ఇంత బలంగా మారడానికి అతడి సారథ్యం కూడా ఓ కారణం. సీనియర్లతో పాటు ఎందరో యువకులు భారత జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇది మంచి వోషయం' అని షమీ క్రిక్బజ్తో తెలిపాడు.
చిన్నప్పటి దోస్త్ లాగే
'సహజంగా ఏ బౌలరైనా బంతులేసే ముందు కెప్టెన్తో మాట్లాడటానికి కాస్త సందేహంగా ఉంటాడు. కానీ విరాట్ కోహ్లీ విషయంలో ఎప్పుడూ అలా జరగలేదు. బాగా బౌలింగ్ చేయమని చెప్తాడు. మాతో కలిసి జోకులు వేస్తాడు. జట్టులోని ప్రతి ఒక్కరితో సరాదాగా ఉంటాడు. అందరితో చిన్నప్పటి మిత్రుడిలా కలిసిపోతాడు. నా వరకు అయితే.. నా చిన్నప్పటి దోస్త్ లాగే కోహ్లీ కనిపిస్తాడు. అంత బాగుంటాడు మరి' అని మహ్మద్ షమీ పేర్కొన్నాడు. గతకొన్నేళ్లుగా టీమిండియా బౌలింగ్ దళం బలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తోంది.
India vs England: ఇంగ్లండ్పై భారత్ 3-2తో సిరీస్ గెలుస్తుంది.. రాహుల్ ద్రవిడ్ జోస్యం!!
అంచలంచెలుగా ఎదుగుతూ
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. కెరీర్ ఆరంభం నుంచి పరుగుల వరద పారించాడు. ఎంఎస్ ధోనీ నాయత్వంలో ఆడి.. అతడి దగ్గర ఎన్నో మెళుకువలు నేర్చుని సారథి అయ్యాడు. కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇక సచిన్ 100 సెంచరీలకు చేరువలో ఉన్నాడు. మరొక్కటి చేస్తే రికీ పాంటింగ్ సరసన చేరుతాడు.