87 మ్యాచ్లాడిన రోహిత్ 2,207 పరుగులు
టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో వెస్టిండీస్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదిన మిథాలీ రాజ్ (56: 47 బంతుల్లో 7ఫోర్లు).. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 87 మ్యాచ్లాడిన రోహిత్ శర్మ 33.44 సగటుతో 2,207 పరుగులు చేశాడు.
మిథాలీ 2,232 పరుగులతో రికార్డ్
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 56 పరుగుల చేసిన మిథాలీ రాజ్.. మొత్తంగా 2,232 పరుగులతో రికార్డ్ సృష్టించింది. దీంతో.. టీ20ల్లో భారత్ టాప్ స్కోరర్గా మిథాలీ రాజ్ నిలవగా.. ఆమె తర్వాతి స్థానాల్లో రోహిత్, విరాట్ కోహ్లి (2,102), సురేశ్ రైనా (1,605), మహేంద్రసింగ్ ధోని (1,487) నిలిచారు.
న్యూజిలాండ్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్మెన్గా న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రికార్డుని వెస్టిండీస్తో చెపాక్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడని ఊహించారు. కేవలం 69 పరుగులు సాధిస్తే ప్రపంచ నెం.1 అవుతాడని భావిస్తే.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అతను రికార్డు చేధించడానికి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లలోనే అవకాశముంది.