జులై 26న బంగ్లాదేశ్తో
జులై 26న బంగ్లాదేశ్తో జరిగే తొలి మ్యాచ్ తర్వాత వన్డేలకు లసిత్ మలింగ గుడ్బై చెబుతున్నట్లు లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ప్రకటించాడు. 35 ఏళ్ల మలింగ ఈ సిరీస్లో తొలి వన్డేలో మాత్రమే ఆడతాడని కరుణరత్నే చెప్పాడు. ఇప్పటిదాకా మలింగ 15 ఏళ్ల కెరీర్లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టాడు.
మలింగకు ఆఖరి వన్డే
శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్ (523), చమిందా వాస్ (399) తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్గా మలింగ నిలిచాడు. కాగా, మూడు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం ప్రారంభం కానుంది. ఇదే మలింగకు ఆఖరి వన్డే కానుంది.
దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ
తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ "ఈ సిరిస్ తర్వాత మలింగ అందుబాటులో ఉండటం లేదు... కాబట్టి వికెట్లు తీసే మరొక బౌలర్ను కావాలి. బంగ్లాతో జరగనున్న తొలి మ్యాచ్లో మలింగ ఆడతాడు. ఆ తర్వాత రిటైర్ అవుతాడు. ఈ విషయాన్ని మలింగనే చెప్పాడు" అని చెప్పాడు.
సెలక్టర్లతో ఏం చెప్పాడో నాకు తెలియదు గానీ
"సెలక్టర్లతో ఏం చెప్పాడో నాకు తెలియదు గానీ... నాతో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడతానని అన్నాడు" అని కెప్టెన్ దిముత్ కరుణరత్నే చెప్పాడు. కెప్టెన్గా వరల్డ్కప్ అనంతం మంచి జట్టుని రూపొందించే బాధ్యత తనపై ఉందని కరుణరత్నే తెలిపాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్లో లసిత్ మలింగ 13 వికెట్లు పడగొట్టాడు.