కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరిన జోస్ బట్లర్
అందరి బౌలింగ్లోనూ స్వీప్, రివర్స్ స్వీప్లతో బౌండరీల మోత మోగించిన జోస్ బట్లర్.. కుల్దీప్ బౌలింగ్లో మాత్రం స్వీప్ షాట్ ఆడేందుకు కూడా సాహాసించలేదు. చివర్లో సిక్స్ కొట్టే ప్రయత్నంలో బంతి నేరుగా వెళ్లి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కుల్దీప్ యాదవ్
ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్ టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ఎడమచేతి వాటం స్పిన్నర్ అంతర్జాతీయ టీ20ల్లో ఐదు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. తొలి టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల వర్షం
ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ప్రధాన ఆయుధం కుల్దీప్ యాదవ్ అని కితాబిచ్చాడు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ "ఏ పిచ్పై ఆడినా కుల్దీప్ యాదవ్ సమర్థవంతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక పిచ్ నుంచి కొంచెం టర్న్ లభిస్తే అతడి బౌలింగ్ మరింత పదునెక్కుతుంది. ఆ సమయంలో కుల్దీప్ బంతుల్ని బ్యాట్స్మెన్ ఎదుర్కోవడం చాలా కష్టం" అని అన్నాడు.
ఈ పర్యటనలో అతనే భారత్ ప్రధాన ఆయుధం
"ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఆలోచనల్ని సులువుగా చదవగలడు. ఈ పర్యటనలో అతనే భారత్ ప్రధాన ఆయుధం. తొలి టీ20లోనే బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో జట్టు రాణించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా.. యువ ఆటగాళ్లు జట్టు బాధ్యతలు పంచుకోవడంతో ఆ ఆనందాన్ని రెట్టింపు అయింది" అని కోహ్లీ అన్నాడు.