కేరళ విజయ లక్ష్యం 295
మనీష్ పాండే 51 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వీరిద్దరూ చెలరేగడంతో కర్ణాటక 49.5 ఓవర్లలో 294 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో కేరళకు 295 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ వారం మొదట్లో జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 29 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కర్ణాటక 123 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విండిస్ పర్యటనలో చెత్త ప్రదర్శన
విండిస్ పర్యటనలో చెత్త ప్రదర్శన కారణంగా కేఎల్ రాహుల్ భారత జట్టుకు దూరమయ్యాడు. విండిస్ పర్యటనలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ నాలుగు ఇన్నింగ్స్ల్లో 44, 38, 13, 6లతో పేలవ ప్రదర్శన చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చోటు కోల్పోయాడు.
కేఎల్ రాహుల్ స్థానంలో గిల్
కేఎల్ రాహుల్ స్థానంలో యువ క్రికెటర్ శుభమాన్ గిల్కు సెలక్టర్లు చోటు కల్పించారు. టెస్టు సిరిస్కు ముందు జరిగిన మూడు టీ20ల సిరిస్లో సైతం కేఎల్ రాహుల్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ధర్మశాల వేదకగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా... రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది.
|
కేఎల్ రాహుల్ స్టీమ్ బాత్
రెండు రోజుల క్రితం కేఎల్ రాహుల్ స్టీమ్ బాత్ చేస్తోన్న ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ "చిల్లింగ్" అనే కామెంట్ పోస్టు చేశాడు. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 'ముందు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోమని చెప్పండి' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.