హగ్ టైఫీల్డ్ రికార్డుని సమం చేసిన మహారాజ్
తాజాగా, ఇప్పుడు ఈ రికార్డుని కేశవ్ మహారాజ్ సమం చేశాడు. మరోవైపు ఒక టెస్టు ఇన్నింగ్స్లో జేసీ లేకర్ (ఇంగ్లాండ్), అనిల్ కుంబ్లే (భారత్)లు పది వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కేశవ్ మహారాజ్ దెబ్బకు శ్రీలంక 338 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఘోరంగా విఫలమైంది.
బౌలర్లు రాణించినా బ్యాట్స్మెన్ విఫలం
బౌలర్లు రాణించినా బ్యాట్స్మెన్ విఫలం కావడంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 34.5 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ డుప్లెసిస్(48), క్వింటన్ డికాక్(32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాట్స్మెన్
సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. లంక బౌలర్లను ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాట్స్మెన్ తెగ ఇబ్బంది పడుతున్నారు.
తొలి టెస్టులో 200 పరుగులు కూడా చేయని సఫారీలు
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 200 పరుగులు కూడా చేయని సంగతి తెలిసిందే. కాగా, లంక బౌలర్లలో అఖిల ధనంజయ(5/52), దిల్రువాన్ పెరీరా(4/40) అద్భుత ప్రదర్శన చేశారు. వైవిధ్యమైన బంతులతో సఫారీ బ్యాట్స్మెన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. క్రీజులో కుదురుకునే సమయం కూడా ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.
స్పిన్నర్లకు అనుకూలిస్తోన్న లంక పిచ్లు
పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించడంతో స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 338 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 124కే కుప్పకూలడంతో లంకకు 214 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం రెండో రోజు ఆట ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక 20 ఓవర్లకు వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది.