ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం'నకిలీ జనన ధ్రువీకరణ పత్రంను రసిక్ సమర్పించాడు. దీంతో అతనిపై రెండేళ్ల పాటు వేటు వేసాం' అని బీసీసీఐ మీడియా సమావేశంలో తెలిపింది. ఐపీఎల్-12 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు రసిక్ ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో రసిక్ 42 పరుగులు ఇచ్చాడు. మొదటి స్పెల్ రసిక్ అద్భుతంగా వేసాడు. మూడు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఇనింగ్స్ చివరలో రిషబ్ పంత్ చెలరేగడంతో ఆ ఒక్క ఓవర్లోనే 21 పరుగులు సమర్పించుకున్నాడు.
ముంబై ఇండియన్స్ అతనిని బేస్ ప్రైస్ 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. జమ్మూ కశ్మీర్ నుండి ఐపీఎల్కు ఎంపికయిన మూడో ఆటగాడు రసిక్ సలామ్. పర్వేజ్ రసూల్, మంజూర్ దార్ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ప్రతిభావంతుడైన బౌలర్గా పేరు తెచ్చుకున్న రసిక్ అనవసర వివాదంతో కెరీర్ను నాశనం చేసుకున్నాడు.