ఆఖరి ఓవర్లో భారత విజయానికి 16 పరుగులు
దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ "ఆఖరి ఓవర్లో భారత విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికే సగం వికెట్లు కోల్పోయి ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉన్నా.. కృనాల్తో కలిసి నేను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశాను. లక్ష్యాన్ని పూర్తి చేయగలమనే నమ్మకంతో ఉన్నాం. మూడో బంతికి కృనాల్కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగించా. ఆ మరుసటి బంతినే సిక్స్ కొడుదామనుకుని గట్టి నమ్మకం పెట్టుకున్నా" అని అన్నాడు.
దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ
"కానీ అనుభవజ్ఞడైన టిమ్ సౌథీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎత్తులు పారలేదు. అంతేగానీ కృనాల్కు బ్యాటింగ్ ఇవ్వద్దనే ఆలోచన నాలోలేదు. ఇన్నింగ్స్ నిర్మించేందుకు మిడిలార్డర్లో చాలా సమయముంటుంది. ఒత్తిడిలో భారీ షాట్లు ఆడగల నా సామర్థ్యాన్ని నేను నమ్మాలి. అదే సమయంలో అవతలి ఎండ్లో ఉన్న సహచర బ్యాట్స్మన్ను నమ్మాలి. ఒక్కోసారి మన ప్రయత్నం ఫలిస్తుంది.. మరోసారి ఫెయిల్ అవుతాం" అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.
హామిల్టన్ టీ20లో అదే జరిగింది
"హామిల్టన్ టీ20లో అదే జరిగింది. నేను అనుకున్నట్లుగా ఆడలేకపోయా. మ్యాచ్ పరిస్థితి ఏంటో వారికి పూర్తిగా తెలుసు. ఇద్దరు కలిసి మ్యాచ్ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డాం. ఒక్కోసారి బౌండరీ బాది జట్టును గెలిపిస్తే.. మరోసారి బౌలర్ది పైచేయి అవుతుంది. ఆ రోజు మ్యాచ్లో సౌథీ యార్కర్లు సంధించడంతో భారీ షాట్లు సాధ్యపడలేదు. క్రికెట్లో అలాంటివి జరగడం సహజం" అని దినేశ్ కార్తీక్ అన్నాడు.
మెరుగైన ప్రదర్శన వెనుక ముంబై క్రికెటర్ అభిషేక్ నాయర్
పునరాగమనం తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం వెనుక ముంబై క్రికెటర్ అభిషేక్ నాయర్ ఉన్నాడంటూ దినేశ్ కార్తీక్ చెప్పాడు. "తాను ఈ స్థాయిలో నిలకడగా రాణించడంలో అతని మద్దతు వెలకట్టలేనిది. అభిషేక్, నేను కలిసి ఒత్తిడిలో ఎలా నెట్టుకు రావాలనే దానిపై చాలా చెమటోడ్చాం. వేర్వేరు రకాల వికెట్లపై రోజులకు రోజులు ప్రాక్టీస్ చేశాం. అందుకే మ్యాచ్ ఫినిషర్గా వెలుగులోకి వచ్చాను. ఎంత టి ఒత్తిడినైనా చిత్తు చేయగలనన్న నమ్మకం నాలో కలిగింది" అని కార్తీక్ అన్నాడు.