|
తొలుత రాహుల్ ఎంపిక కాలేదు
తొలుత జింబాబ్వే పర్యటనకు రాహుల్ ఎంపిక కాలేదు. అతను ఎందుకు ఎంపిక కాలేదో కూడా అప్పట్లో ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. 'హే గాయ్స్ నా ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి నేను కొన్ని విషయాలపై ఓ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. జూన్లో నాకు జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. వెస్టిండీస్ పర్యటన కోసం జాతీయ జట్టులోకి తిరిగి రావాలనే ఆశతో నేను నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ కూడా ప్రారంభించాను. దురదృష్టవశాత్తు నేను పూర్తి ఫిట్నెస్ దశకు చేరుకునే టైంలో నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఫలితంగా మళ్లీ నేను ఎప్పటిలాగే మొదటికొచ్చాను. కోవిడ్ తగ్గాక కొన్ని వారాల పాటు మళ్లీ ఫిట్నెస్ శిక్షణ తీసుకుని మళ్లీ జట్టుకు అందుబాటులోకి వస్తా' అని సదరు ట్వీట్లో రాహుల్ పేర్కొన్నాడు. తాజాగా రాహుల్ ఫిట్ నెస్ టెస్ట్ పాస్ కావడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఏకంగా జింబాబ్వే వన్డే సిరీస్కు కెప్టెన్సీ హోదా కూడా వచ్చింది.
|
ధావన్ ఏమనడనే కదా..?
ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో ధావన్ సారథ్యంలో టీమిండియా 3-0తేడాతో వన్డే సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో ధావన్ వ్యక్తిగతంగా, కెప్టెన్గా మంచి ప్రదర్శన చేశాడు. వన్డే ఫార్మాట్లో తాను రెగ్యులర్ ప్లేయర్ కూడా. అయితే ధావన్ పట్ల బీసీసీఐ తాజాగా వ్యవహరించిన విధానం అభిమానులకు నచ్చట్లేదు. అల్రెడీ అతనే కెప్టెన్ అని ప్రకటించాక.. రాహుల్ కోలుకున్నాడని అతన్ని వెంటనే తప్పించడమేంటీ? అతనేం రాహుల్ కన్నా జూనియర్ కాదు కదా.. మోస్ట్ సీనియర్ ప్లేయర్. ఇంతకుముందు కెప్టెన్సీ వహించిన అనుభవముంది. అయినా అవేమీ పట్టకుండా బీసీసీఐ ఎందుకిలా డిమోట్ చేస్తుంది. ధావన్ అయితే ఏం చేసినా సర్దుకుపోతాడు ఏమనడు అనడనే కదా ఇంత తెగింపుకొచ్చింది అంటూ బీసీసీఐ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
|
ఉన్నపలంగా తప్పించడమేంటీ.. షేమ్ ఆన్ యూ బీసీసీఐ
ఓ నెటిజన్ మరోసారి ధావన్ పట్ల బీసీసీఐ వివక్ష బట్టబయలైంది. సీనియర్ ప్లేయర్ పట్ల ఇలాంటి వైఖరి అస్సలు ఊహించలేదు. షేమ్ అన్ యూ బీసీసీఐ అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. అనౌన్స్ మెంట్ చేసి ఉన్నపలంగా తప్పిస్తే ఓ సీనియర్ ప్లేయర్ ఎంత డిస్సాపాయింట్ అవుతాడు.. కాస్త ఆలోచించాలి కదా అంటూ బుద్ధి చెప్పాడు. ఇంకో నెటిజన్.. ధావన్ కెరీర్కు ముగింపు పలకడానికి ఇదో ఎత్తుగడ అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు. ఇంకొకరు ఇది అన్యాయమని పేర్కొన్నాడు. ఇంతకీ ధావన్ను ఉన్నపలంగా తప్పించి.. డిమోషన్కు గురి చేయడం ఎంత వరకు కరెక్టో ప్రేక్షకులే చెప్పాలి.