ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్కు ఎందుకు స్పెషల్ అంటే?
ఇకపోతే ఈ సీజన్ రాజస్థాన్ కు చాలా స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ రాయల్, ఆ జట్టుకు తొలి ఎడిషన్లోనే కప్ అందించిన ఆసీస్ కెప్టెన్ షేన్ వార్న్.. ఐపీఎల్ కు ముందు దివంగతులైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆసాంతం వార్న్ ను తలుచుకుని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఆడుతుంది. ఎలాగైనా వార్న్ కు నివాళిగా కప్ కొట్టి ఇవ్వాలని రాజస్థాన్ తలుస్తోంది.
ఈ క్రమంలో కెప్టెన్ సంజూ శాంసన్ నాయకత్వంలో జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హిట్మయర్, మెక్కాయ్, బౌల్ట్ లాంటి మ్యాచ్ విన్నర్లను కలిగి ఉన్న రాజస్థాన్ ట్రోఫీ గెలవడానికి ఇంతకంటే సరైన టైం, జట్టు దొరకదు.
ఆర్సీబీని పట్టుదలగా కట్టడి చేసి
ఇక నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. ఆర్సీబీని పట్టుదలగా కట్టడి చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (7) యథావిధిగా కీలక మ్యాచ్ లో చేతులెత్తేయగా.. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (25) టెస్ట్ ఇన్నింగ్స్, గ్లెన్ మాక్స్వెల్ (24) అరకొర బ్యాటింగ్ ఆర్సీబీ కొంపముంచింది. కేవలం రజత్ పాటిదార్ (58పరుగులు 42బంతుల్లో) పోరాడడంతో 157పరుగుల స్కోరు చేయగలిగింది.
ఇక రాజస్థాన బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ (3/22), ఒబెడ్ మెక్కాయ్ (3/23) ఆర్సీబీ పతనాన్ని శాసించారు. రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు. ఇక ఛేదనలో బట్లర్ (106పరుగులు 60బంతుల్లో 10ఫోర్లు 6సిక్సర్లు) చెలరేగగా.. యశస్వి జైశ్వాల్ (21పరుగులు 13బంతుల్లో), సంజూ శాంసన్ (23పరుగులు 21బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) రాణించడతో సునాయసంగా ఆర్ఆర్ గెలిచింది.
ఇక ఈ మ్యాచ్లో ఒక్క అవార్డు తప్పా అన్ని అవార్డులు జోస్ బట్లర్కే..!
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ - జోస్ బట్లర్
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ - జోస్ బట్లర్
అత్యధిక సిక్సర్లు - జోస్ బట్లర్
పవర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ - జోస్ బట్లర్
మ్యాచ్లో అత్యంత విలువైన ఆస్తి - జోస్ బట్లర్
మ్యాచ్లో వేగవంతమైన డెలివరీ - ప్రసిద్ధ్ కృష్ణ
అత్యధిక ఫోర్లు - జోస్ బట్లర్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - జోస్ బట్లర్