నకిలీ ధ్రువపత్రాలతో సహాయపడుతున్నాడని
అంతేకాకుండా చాలా మంది ఆటగాళ్లకు ఆయన నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బీసీసీఐ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు సహాయపడుతున్నాడని శర్మ ఆరోపించాడు. ఈ మేరకు అక్రమ్, శర్మ మధ్య జరిగిన ఫోన్ సంప్రదింపుల ఆడియో టేప్ను కూడా ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది.
ఫైవ్ స్టార్ హోటల్కి అమ్మాయిలను పంపించాలి
‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో చాలా మంది పెద్దలున్నారు. వాళ్లందరినీ ఒప్పించాలంటే న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్కి అమ్మాయిలను పంపించాలి' అని శర్మను అక్రమ్ అడిగినట్లు ఆడియో టేప్లో సమాచారం. జట్టులో తనకు కచ్చితంగా స్థానం కల్పిస్తానని శర్మకు అక్రమ్ చెప్పడం మరో ఫోన్ సంభాషణలో స్పష్టమైంది.
తమ పేర్లను ఇష్టపడలేదు
శర్మతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు అక్రమ్పై ఆరోపణలు చేశారు. అయితే వారు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమ్కు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ అతడే షోని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు
అక్రమ్ను మీడియా సంప్రదించగా.. తనపై వస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ‘నా దగ్గరకు అమ్మాయిని పంపానని ఆ కుర్రాడు చెబుతున్నాడు. అతని ఆరోపణలు నిజమైతే, ఇప్పటితే అతను క్రికెట్ ఆడుతూ ఉండాలి. కానీ, లేదు. ఒకవేళ అతను ఉత్తరప్రదేశ్కు ఆడి ఉంటే అతడి ఆరోపణలు నిజమై ఉండేవి. ఉత్తరప్రదేశ్ 60 మంది క్రీడాకారుల జాబితాలో అతని పేరు ఎప్పుడూ కనబడనేలేదు. అసలు అతను జూనియర్ క్రికెటర్ కూడా కాదు' అని అక్రమ్ వివరణ ఇచ్చారు.
ఇలాంటి ఆరోపణలు రావడం సహజమే
త్వరలోనే నిజం బయటపడుతుందని, ఓ పెద్ద మనిషి (రాజీవ్ శుక్లా) వెనుక ఉన్న తనపై అన్ని వైపుల నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం సహజమేనని అక్రమ్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనపై ఆర్పీ సింగ్, మహమ్మద్ కైఫ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.