|
కూల్గా ఉండేవాళ్లు సైతం ఐపీఎల్లో ఇలా అయిపోతారు
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ముత్తయ్య మురళీధరన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టుకు ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా.. చాలా కూల్గా కన్పించేవాడు. ఎప్పుడూ తన నవ్వును చెదరనివ్వని ఈ దిగ్గజం.. ఐపీఎల్ పుణ్యమా అని బరస్ట్ అయిపోయాడు. గతంలో చాలా కూల్ పర్సన్స్ అని పేరున్న మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ సైతం ఇలా ఐపీఎల్లో తమ సహనాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లలో ఉండే ఉద్విగ్నతే ఇందుకు కారణం.
|
పాపం జాన్సేన్
నిజానికి మార్కో జాన్సేన్ చివరి ఓవర్ బానే బౌలింగ్ చేశాడు. తన ప్లాన్ ప్రకారం.. ప్రతి బంతిలో వైవిధ్యత చూపించాడు. ఎగ్జిక్యూషన్ లోపం కొంత.. అలాగే రషీద్ ఖాన్ ఎటాకింగ్ కొంత అతని ప్లాన్ను పూర్తిగా చెడగొట్టాయి. తొలిబంతికి స్లో కట్టర్ వేశాడు.. కానీ దాన్ని తెవాతీయా సిక్సర్గా మలిచాడు. తన బౌలింగ్లో వైడ్ యార్కర్, బౌన్సర్, స్ట్రెయిట్ యార్కర్, లో ఫుల్ టాస్ లాంటి వైవిధ్య భరిత బంతులు వేసినా.. గాచారం బాగాలేకపోతే ఏం చేస్తాడు పాపం.
|
మ్యాచ్ను మలుపు తిప్పిన ఉమ్రాన్.. కానీ
ఉమ్రాన్ మాలిక్ 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పాడు. ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో గిల్, సాహా, మిల్లర్, అభినవ్ మనోహర్లను బౌల్డ్ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యాను క్యాచ్ ఔట్ చేశాడు. 16ఓవర్లు ముగిసేసరికి 140పరుగులతో 5వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. ఇక గెలుపు కష్టమే అనుకున్న తరుణంలో సన్ రైజర్స్ బౌలర్లు నిరాశపర్చడం, చివర్లో జాన్సేన్ 22పరుగులను కూడా డిఫెండ్ చేయలేకపోవడంతో ముత్తయ్య మురళీధరన్ అసహనానికి లోనయ్యాడు.
ఇంకా ఒక్క వికెట్ పడినా.. సన్ రైజర్స్ గెలిచేది. కానీ మాలిక్ తప్పా మిగతా వాళ్లు ఎవరూ వికెట్లు తీయకపోవడంతో మురళీధరన్కు చిర్రెత్తుకొచ్చింది. ఈ మ్యాచ్లో మరో విశేషమేంటంటే.. తన చివరి ఓవర్లో సన్ రైజర్స్ బ్యాటర్లు 25పరుగులు చేయగా.. గుజరాత్ సైతం చివరి ఓవర్లో 25పరుగులు చేసింది.